అమెరికాకు రావద్దంటున్న ట్రంప్…ఇక తెలుగు విద్యార్థులకు MS చేయడానికి బెస్ట్ ఆప్షన్ గా ఉన్న టాప్ 5 దేశాలు ఇవే

మెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విదేశీ విద్యార్థుల విషయంలో చాలా కఠిన వైఖరి వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా అక్కడ విద్యనభ్యసించే భారతీయ విద్యార్థులు అందులోనూ తెలుగు విద్యార్థులకు డోనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు చాలా ఇబ్బందికరంగా మారుతున్నాయి అని చెప్పవచ్చు.


ముఖ్యంగా మన దేశం నుంచి ఎక్కువగా అమెరికాకు వచ్చే విద్యార్థుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు అత్యధిక సంఖ్యలో ఉంటారు వీరంతా బీటెక్ పూర్తి చేసి ఎంఎస్ ఎందుకు ఎక్కువగా అమెరికాకు వస్తుంటారు. ఎంఎస్ పూర్తి చేసిన అనంతరం అక్కడే ఉద్యోగం వెతుక్కుని, వివాహం చేసుకొని, పిల్లలను సైతం అమెరికాలోనే కానీ గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తుంటారు. గడచిన రెండు మూడు దశాబ్దాలుగా ఇదే తంతు నడుస్తోంది. అయితే ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధికారంలో వచ్చినప్పటి నుంచి విదేశీ విద్యార్థులను టార్గెట్ చేస్తూ యూనివర్సిటీ క్యాంపస్ లో నుంచి వారి స్టూడెంట్ వీసాలను సైతం రద్దు చేసి వెనక్కు పంపిస్తున్నారు. అంతేకాదు ఆ దేశంలో భవిష్యత్తులో ఉద్యోగం చేయకుండా కఠినమైన నిబంధనలకు సైతం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీటెక్ చదివి ఎమ్మెస్ చేయాలి అనుకునే విద్యార్థులకు ఇతర దేశాలు ఒక చక్కటి ఆప్షన్ అవుతున్నాయని చెప్పవచ్చు. అమెరికా కాకుండా ప్రపంచంలోని ఏ ఇతర దేశాల్లో ఎమ్మెస్ చదువుకోడానికి వీలుగా ఉంటుందో తెలుసుకుందాం.

యూకే: 
భారతీయ విద్యార్థులకు యూకే అనేది ఒక చక్కటి ఆప్షన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే అమెరికా తర్వాత అత్యధిక మంది విద్యార్థులు చదివే దేశం యునైటెడ్ కింగ్డమ్. ఇక్కడ యూనివర్సిటీలో ప్రపంచ ప్రసిద్ధి చెందినవి. Oxford, Cambridge, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వంటి ప్రపంచ ప్రసిద్ధి యూనివర్సిటీలు ఈ దేశంలో ఉన్నాయి. యూకే లో కోర్సులు చాలావరకు ఒక సంవత్సరం వ్యవధిలో మాత్రమే ఉంటాయి. . అయితే ఇక్కడ కొన్ని తేడాలు ఉన్నాయి లండన్ లో ఉండే యూనివర్సిటీల్లో కోర్స్ ఫీజు ఎక్కువగా ఉంటుంది. లండన్ వెలుపల అయితే కోర్సు ఫీజు తక్కువగా ఉంటుంది. సాధారణంగా యూకేలో ఎమ్మెస్ చేయడానికి అయ్యే ఖర్చు సుమారు రూ. 20 లక్షల నుంచి రూ.35 లక్షల దాకా అవుతుంది. అయితే యూకేలో UK Graduate Work Visa అందజేస్తారు. అంటే కోర్సు పూర్తయ్యాక 2 సంవత్సరాలు పనిచేసేందుకు వర్క్ వీసా అందుబాటులో ఉంటుంది.

కెనడా: కెనడాలోని ప్రభుత్వ యూనివర్సిటీలలో ఫీజులు చాలా తక్కువగా ఉంటాయి అలాగే ఇక్కడ యూనివర్సిటీలలో మంచి కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. కోర్స్ ఫీజులు కూడా చాలా తక్కువ. 9 లక్షల రూపాయల నుంచి 20 లక్షల రూపాయల మధ్యలో ఎంఎస్ పూర్తి చేసుకోవచ్చు.

న్యూజిలాండ్ : న్యూజిలాండ్ భారతీయ విద్యార్థులకు చాలా అనుకూలమైన దేశం. కోర్సు ఫీజు రూ. 10 లక్షల నుంచి రూ. 18 లక్షల వరకూ ఉంటుంది.

జర్మనీ: ఇక్కడ యూనివర్సిటీల్లో ట్యూషన్ ఫీజు ఉండదు. పూర్తిగా ఉచితం. అయితే యూనివర్సిటీల్లో అడ్మినిస్ట్రేటివ్ చార్జెస్ కింద రూ. 30,000 నుంచి రూ. 50,000 మాత్రమే వసూలు చేస్తారు.

నార్వే: ఇక్కడ కూడా యూనివర్సిటీల్లో ట్యూషన్ ఫీజు దాదాపు ఉచితం. అయితే లివింగ్ కాస్ట్ మాత్రం ఎక్కువగా ఉంటుందన్న సంగతి మర్చిపోవద్దు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.