విశాఖలోని ఓ అపార్ట్‌మెంట్ దుకాణం పెట్టేశారు.. నలుగురు యువతులతో

www.mannamweb.com


విశాఖ టు చైనా కేంద్రంగా జరుగుతున్న భారీ ఆన్‌లైన్‌ స్కామ్‌ గుట్టురట్టు చేశారు.. పోలీసులు. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌, టాస్క్‌ల పేరిట మోసాలు చేస్తున్న ఈ గ్యాంగ్‌కు..చైనా ముఠాతో లింకులు ఉన్నట్టు గుర్తించారు పోలీసులు.

అధిక లాభాల పేరుతో అమాయకులను ట్రాప్‌ చేస్తోంది ఈ గ్యాంగ్‌. విశాఖలోని ఓ అపార్ట్‌మెంట్ కేంద్రంగా ముఠా కార్యకలాపాలు సాగుతున్నాయి. పక్కా సమాచారంతో సెంటర్‌పై దాడి చేసిన పోలీసులు..నలుగురు యువతులు సహా ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ముఠా సభ్యుల నుంచి పెద్దసంఖ్యలో ల్యాప్‌టాప్‌లు, చెక్కుబుక్కులు, సిమ్‌కార్డులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

విశాఖను అడ్డాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న ఈ గ్యాంగ్‌కు..అందుకు అవసరమైన సాంకేతిక పరికరాలు, సిమ్‌కార్డులు, మొబైల్‌ ఫోన్లువయా ఢిల్లీ మీదుగా చైనా నుంచి అందుతున్నాయని చెబుతున్నారు పోలీసులు.

ఈ గ్యాంగ్‌ ఇంతవరకూ 9 కోట్ల రూపాయల లావాదేవీలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. దర్యాప్తులో విషయాలు వెలుగుచూసే అవకాశం ఉంది. ఏదేమైనా ఇలాంటి కంత్రీగ్యాంగ్‌ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు.