తిరుమలలో జగన్ రెడ్డి చేసిన పాపాల లిస్టు ఇది

www.mannamweb.com


జగన్ రెడ్డి పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానంలో చేసిన అక్రమాలు, అన్యాయాలు అన్నీ ఇన్నీ కాదు. అక్రమాలు అన్యాయాలే కాదు తిరుమలలో భక్తుల సౌకర్యాలను మొత్తం తీసేసిన ఘనత కూడా జగన్ రెడ్డి ప్రభుత్వానిదే.

జగన్ రెడ్డి ప్రభుత్వం తిరుమల తిరుపతిలో భక్తులకు చేసిన ద్రోహం పై ఒక చిన్న విశ్లేషణ ఇది. క్యూ లైన్ లో భోజన సదుపాయం ఎత్తివేసింది జగన్ రెడ్డే. అదే విధంగా అన్న ప్రసాదాలు, పాలు, టీ, కాఫీ వితరణ ఎత్తెయ్యడం కూడా ఆయన పాలనలోనే జరిగింది. తిరుమల రోడ్లు, గోడలపై బులుగు రంగు వెయ్యడం కూడా జగన్ రెడ్డి హయాంలోనే జరిగింది.

అన్నప్రసాద కేంద్రంలో నాణ్యత కలిగిన సరైన భోజనం పెట్టకపోవడం, తిరుపతిలో ఒక కొండపై చర్చిలు కట్టడం, హిందూ దేవాలయాల సొమ్ము ఇతర మత ధర్మాల వారికి కేటాయించడంలాంటి పనులు చేసింది కూడా జగన్ రెడ్డి ప్రభుత్వమే. దేవుడి సొమ్ము దొబ్బెయ్యడానికి గత ఐదు సంవత్సరాలలో జరిగినన్ని ప్రయత్నాలు మరెన్నడూ జరగలేదు. ఇతర మతస్థులకు హిందూ గుళ్ళలో ఉద్యోగాలు ఇవ్వడం, వాటిపై ఫిర్యాదులు వచ్చినా కూడా పరిష్కరించకపోవడం జగన్ రెడ్డి పాలనలో హైలైట్ గా చెప్పవచ్చు.

క్రైస్తవుడైన జగన్ రెడ్డి దర్శనానికి వచ్చినప్పుడు డిక్లరేషన్ ఇవ్వకపోవడం, అదే విధంగా పట్టు వస్త్రాలు సమర్పించే సమయంలో భార్యతో రాకపోవడం కూడా జగన్ రెడ్డి, ఆయన తండ్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి నిస్సిగ్గుగా చేసేశారు. ఏడు కొండల మీద తనపై నినాదాలు చేయించుకోవడం కూడా జగన్ రెడ్డి ప్రత్యేకత. అదే విధంగా స్వామివారి కైంకర్యాలలో మార్పులు చేయడం కూడా జగన్ రెడ్డి సమయంలోనే జరిగింది. స్వామి వారి నిజపాద దర్శనం రద్దు చేయడం, భక్తులు ఎంతో ఇష్టపడే అంగప్రదక్షిణ సేవ టిక్కెట్లు నేరుగా కొండపైనే ఇవ్వకుండా ఆన్ లైన్ లో పెట్టడం కూడా భక్తులకు ఎంతో అసౌకర్యాన్ని ఒనగూర్చాయి.

కొన్ని సేవలు రద్దు చేయడం, ప్రత్యేక దర్శనం టోకెన్ల జారీలో ఆన్లైన్ అక్రమాలు, చివరకు శ్రీవారి సేవ సౌకర్యంలో కూడా అవకతవకలు చేయడం జగన్ రెడ్డి పాలనలో ప్రత్యేకత గా చెప్పవచ్చు. తిరుమల కొండపై ఫ్రీ బస్సు సర్వీసును కొంత కాలం యెత్తెయ్యడం భక్తులకు ఎంతో అసౌకర్యం కల్పించింది. జీడిపప్పు కాంట్రాక్టు ఇతర మతస్థుడికి ఇచ్చారన్న ఆరోపణ, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై అరాచకత్వం, భక్తులను పోలీసుల చేత కొట్టించడం లాంటి పనులు ఎన్నో జరిగాయి. లడ్డూ ప్రసాదం ధర పెంచడం, గదుల ధరలను విపరీతంగా పెంచడం కూడా జగన్ రెడ్డి చేసిన భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచాయి.

పులులు వస్తున్నాయని చెప్పి చేతి వూత కర్రలు అద్దెకు ఇవ్వడం, నీళ్ళ గాజు సీసాలు అమ్మడం లాంటివి ఏ మాత్రం ప్రణాళిక లేని జగన్ రెడ్డి తత్వాన్ని తెలియ చేశాయి. 24 గంటల్లో అప్పటి మంత్రి రోజా ఎప్పుడు వచ్చినా & ఎలా వచ్చినా సరే…100 మందితో వచ్చినా సరే ప్రత్యేక టిక్కెట్ సౌకర్యం కల్పించడం తీవ్ర మైన విమర్శలకు తావిచ్చింది. తాగుబోతు, క్రిష్టియన్ ధర్మ పాలకుడు అని కూడా ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తిని టిటిడిలో ప్రధాన స్థాయిలో అధికారిగా పెట్టడం జగన్ రెడ్డి పాపాలకు పరాకాష్ట. స్వామివారికి చెందిన అడవుల్లో చందనం చెట్లు కొట్టేయడం మరింత దారుణమైన సంఘటన.