టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. కిడ్నీ సంబంధిత సమస్యలతో పాటు షుగర్, బీపీ వ్యాధులతోనూ పోరాడుతున్నాడు.
గతంలో తీవ్ర అనారోగ్యంతో గాంధీ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నాడు. అప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రూ.2 లక్షల ఆర్థిక సాయం చేశారు. దీంతో కొన్ని రోజులు బాగానే ఉన్నాడీ నటుడు. అయితే మళ్లీ ఇప్పుడు ఆస్పత్రి పాలయ్యాడు ఫిష్ వెంకట్. తీవ్ర అనారోగ్యం పాలు కావడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటున్నాడు. మరోవైపు ఫిష్ వెంకట్ చికిత్స కోసం సాయం చేసేందుకు దాతలు ముందుకు రావాలని నటుడి భార్య, కూతురు చేతులెత్తి మొక్కుతున్నారు. కాగా ఫిష్ వెంకట్ కు సరైన చికిత్స అందితే బతికే ఛాన్స్ ఉందని వైద్యులు చెబుతున్నారు.
‘వెంకట్ కిడ్నీ సమస్యకు డయాలసిస్ చేయించుకుంటున్నారు. కానీ ఆయన పరిస్థితి ఇప్పుడు మరింత క్షీణించింది. ఇప్పుడు అవయవ మార్పిడి చేస్తే ఆయన ప్రాణాలకు ముప్పు తప్పుతుంది. ప్రస్తుతం ఆయనను బతికించుకునేందుకు ఇదొక్కటే మార్గం. ప్రస్తుతం డయాలసిస్ చేస్తే ఫిష్ వెంకట్ పరిస్థితి మెరుగవచ్చు… కానీ మళ్లీ సిక్ అవ్వడంఖాయం. పైగా ఆయన ఎక్కువగా స్పృహలో ఉండటం లేదు. ఒక్క డయాలసిస్ చేసినప్పుడు మాత్రమే ఆయన కాస్త మెరుగ్గా కనిపిస్తున్నారు వీలైనంత త్వరలో ఆయనకు కిడ్నీను మారిస్తే బ్రతికే అవకాశం ఉంది’ అని వైద్యులు తెలిపారు.
100కు పైగా ల్లో.. ఇప్పుడిలా..
ఫిష్ వెంకట్ 100కు పైగా చిత్రాల్లో నటించి నవ్వించారు. ఆది, చెన్నకేశవ రెడ్డి, దిల్, బన్నీ, ఢీ, దుబాయ్ శ్రీను, కృష్ణ, బుజ్జిగాడు, రెడీ, ఆంజనేయులు, అదుర్స్, మిరపకాయ్, కందిరీగ, రచ్చ, గబ్బర్ సింగ్, బలుపు, అత్తారింటికి దారేది తదితర సూపర్ హిట్ ల్లో తన కామెడీతో కడుపుబ్బా నవ్వించారు. అలాంటి ఆయన ఇప్పుడు ఆస్పత్రి బెడ్ పై ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న సినీ అభిమానులు ఫిష్ వెంకట్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
































