ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఆ ఇళ్లు, స్థలాలు ఇక మీ సొంతమే.. ఆ ఆస్తులకు యాజమాన్య హక్కులు

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామాల్లోని ఇళ్లు, షాపులు, స్థలాలకు యాజమాన్య హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం చేపట్టిన స్వామిత్వ కార్యక్రమం వేగవంతం అయ్యింది.


2026 మార్చి నాటికి 45 లక్షల ఆస్తులకు ప్రాపర్టీ కార్డులు జారీ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి క్షేత్రస్థాయి సర్వేలు పూర్తి చేయాలని ప్లాన్ చేశారు. ప్రస్తుతం 6వేల గ్రామాల్లో ‘ఆర్థో రెక్టిఫైడ్‌ ఇమేజ్‌’ ఆధారంగా ఆస్తుల కొలతలు సేకరిస్తున్నారు. దశాబ్దాలుగా యాజమాన్య హక్కులు లేని గ్రామకంఠాల ఆస్తులకు హక్కులు కల్పించనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో చాలా కాలంగా ఉన్న ఇళ్లు, స్థలాలకు ఇప్పటికీ సరైన యాజమాన్య పత్రాలు లేవు. వీటిని అమ్మినా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నమోదు చేయడం కష్టంగా ఉండేది. దీనికి ప్రధాన కారణం ఆస్తులు గ్రామకంఠాల పరిధిలో ఉండటం. ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం స్వామిత్వ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఈ కార్డుల ద్వారా ప్రజలు తమ ఆస్తులపై పూర్తి యాజమాన్య హక్కులను పొందగలుగుతారు. దీనివల్ల ఆస్తుల అమ్మకాలు, కొనుగోళ్లు సులభతరం అవుతాయి. అలాగే, బ్యాంకుల నుంచి రుణాలు పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమం గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహిస్తుందని భావిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఆస్తుల సమగ్ర సర్వే చేపట్టింది. డ్రోన్ల సహాయంతో 6వేల గ్రామాల్లో 45 లక్షల ఆస్తుల వివరాలు సేకరించి, వాటి ఆధారంగా ప్రాపర్టీ పార్సిల్ మ్యాపింగ్ చేస్తున్నారు. ఈ ప్రక్రియలో ప్రతి ఇంటి, స్థలం పొడవు, వెడల్పు వివరాలు నమోదు చేస్తున్నారు. ఈ కొత్త కార్డుల జారీ ప్రక్రియలో భాగంగా, రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఆస్తుల వివరాలను ఖచ్చితంగా నమోదు చేస్తున్నారు. డ్రోన్ల ద్వారా సేకరించిన సమాచారాన్ని ఉపయోగించి, ఆర్థో రెక్టిఫైడ్‌ ఇమేజ్‌లను తయారు చేస్తున్నారు. ఈ ఫోటోల ద్వారా ప్రతి ఆస్తి యొక్క ఖచ్చితమైన కొలతలు, సరిహద్దులు తెలుసుకుంటున్నారు. రెవెన్యూ, సచివాలయాల సిబ్బంది ప్రతి ఆస్తి వద్దకు వెళ్లి, కొలతలు తీసి, వాటిని నిర్ధారిస్తున్నారు. ఈ సర్వే వల్ల ఆస్తుల యాజమాన్య హక్కులు స్పష్టమవుతాయి.

ఇప్పటివరకు 43 లక్షల ఆస్తుల తనిఖీ పూర్తయింది. మిగిలిన ఆస్తుల తనిఖీ కూడా రెండు, మూడు రోజుల్లో పూర్తి కానుంది. ఆ తర్వాత, సెక్షన్‌ 9(2) ప్రకారం, ప్రజలకు నోటీసులు జారీ చేస్తారు. ఈ నోటీసులలో ఆస్తుల వివరాలు ఉంటాయి. ప్రజలు తమకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయవచ్చు. ఈ అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత, సెక్షన్‌ 13 కింద క్షేత్రస్థాయి తనిఖీ పూర్తయినట్లు అధికారికంగా ప్రకటిస్తారు. ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యాక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారచిహ్నంతో కూడిన స్వామిత్వ కార్డులను ప్రజలకు అందజేస్తారు

రికార్డ్స్‌ ఆఫ్‌ రైట్స్‌ (ఆర్‌ఓఆర్‌) కింద ఆస్తులకు యాజమాన్య హక్కులు కల్పించే ప్రక్రియలో భాగంగా, మరో 6వేల గ్రామాల్లో 45 లక్షల ఇళ్లు, స్థలాలకు యజమాన్య హక్కులు కల్పించే కార్యక్రమం 2026 మార్చి తర్వాత ప్రారంభం అవుతుంది. ఈ సవరించిన రెవెన్యూ చట్టం ప్రకారం, ప్రజలు తమ ఇళ్లు, ఖాళీ స్థలాలను అవసరాలకు అనుగుణంగా విక్రయించుకోవచ్చు. ఈ క్రయవిక్రయాలను సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో నమోదు చేస్తారు. అలాగే, కార్డు ఆధారంగా ఆస్తులకు బ్యాంకులు రుణాలు అందిస్తాయి. వారసులకు ఆస్తులను సులభంగా బదిలీ చేసుకునే వీలు కలుగుతుంది.

ప్రస్తుతం, రికార్డ్స్‌ ఆఫ్‌ రైట్స్‌ (ఆర్‌ఓఆర్‌) కింద ఆస్తులకు యాజమాన్య హక్కులు కల్పిస్తూ ముద్రించిన జాబితాలను సచివాలయాల్లో, పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శిస్తారు. ఈ జాబితాల్లో పేర్లు మారినా, ఇతర లోపాలు కనిపించినా ప్రజలు తమ అభ్యంతరాలను తెలియజేయవచ్చు. తహసీల్దార్‌ నేతృత్వంలో ఈ లోపాలను సరిదిద్దుతారు.ఈ కొత్త చట్టం వల్ల ప్రజలకు తమ ఆస్తులపై పూర్తి హక్కులు లభిస్తాయి. వారు తమ ఇళ్లను, స్థలాలను స్వేచ్ఛగా అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు. బ్యాంకుల నుంచి రుణాలు కూడా సులభంగా పొందవచ్చు. వారసులకు ఆస్తులు బదిలీ చేయడం కూడా చాలా తేలికవుతుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.