మూడుసార్లు మడతపెట్టే ఫోన్‌.. హువాయ్‌ సంచలనం

www.mannamweb.com


మార్కెట్లోకి ట్రిపుల్ ఫోల్డబుల్ ఫోన్‌ వచ్చేస్తోంది. అంటే ఈ ఫోన్‌ను ఏకంగా మూడుసార్లు మడతపెట్టొచ్చన్నమాట. దాదాపు ఒక ట్యాబ్‌ సైజ్‌లో ఉండే ఈ ఫోన్‌ను మడతపెట్టడం ద్వారా సాధారణ ఫోన్‌లాగా మారుతుంది.

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ తయారీ సంస్థ హువాయ్‌ ఈ ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది.

హువాయ్‌ మేట్‌ ఎక్స్‌టీ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. ప్రపంచంలోనే మొదటి ట్రై ఫోల్డ్‌ ఫోన్‌గా ఇది నిలవనుంది. సెప్టెంబర్‌ 10వ తేదీన ఈ ఫోన్‌ను అధికారికంగా లాంచ్‌ చేయనున్నారు. ఇప్పటికే ఈ ఫోన్‌ను సంబంధించిన ప్రీ బుకింగ్స్‌ మొదలయ్యాయి.

ఇప్పటికే ఈ ఫోన్‌ను సుమారు 7 లక్షల మందిపైగా బుకింగ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 20వ తేదీ నుంచి ఈ ఫోన్‌ అందుబాటులోకి రానుందని సమాచారం. ఈ ఫోన్‌ను కంపెనీ 16GB ర్యామ్‌, 512GB ఇంటర్నల్‌ స్టోరేజ్, 16GB ర్యామ్‌, 1TB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్స్‌లో తీసుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇక ధర విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌ ప్రారంభ వేరియంట్ ధర ఏకంగా రూ. 1.77 లక్షలుగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. మూడు స్క్రీన్స్‌తో కూడిన ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు.

ఈ ఫోన్‌ను పవర్‌ ఫుల్ ప్రాసెసర్‌ను అందించనున్నట్టు తెలుస్తోంది. అదే విధంగా అధిక కెపాసిటీ బ్యాటరీ, 5G కనెక్టివిటీ, అద్భుతమైన కెమెరా సెటప్‌తో పాటు వాటర్‌ రెసిస్టెంట్‌తో ఈ ఫోన్‌ను లాంచ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది.