భారతదేశంలో అత్యంత ఖరీదైన టాప్-5 స్కూల్స్.. ఫీజు ఎంతో తెలిస్తే షాకవుతారు

www.mannamweb.com


సింధియా స్కూల్ అనేది మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఉన్న బాలుర కోసం ఒక ప్రైవేట్ బోర్డింగ్ పాఠశాల. ఈ పాఠశాల 1897లో చారిత్రాత్మకమైన గ్వాలియర్ కోటలో ప్రారంభమైంది.

ఈ పాఠశాల భారత రాచరిక రాష్ట్రాల రాజుల పిల్లల కోసం ప్రారంభించారు. ఆ పాఠశాల వార్షిక ఫీజు 13 లక్షల 50 వేల రూపాయలు.

ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో డూన్ స్కూల్ 1935లో ప్రారంభించారు. ఇది బాలుర కోసం ఒక ప్రైవేట్ బోర్డింగ్ పాఠశాల. మీడియా కథనాల ప్రకారం, ఈ పాఠశాల వార్షిక ఫీజు 10 లక్షల 25 వేల రూపాయలు. టర్మ్ ఫీజు 25 వేల రూపాయలు.

రాజస్థాన్‌లోని అజ్మీర్‌లోని మాయో స్కూల్ కూడా బాలుర కోసం ఒక బోర్డింగ్ స్కూల్. ఇది 1875లో స్థాపించారు. మీడియా కథనాల ప్రకారం, ఎన్నారై విద్యార్థుల పాఠశాల ఫీజు సంవత్సరానికి రూ. 13 లక్షలు. కాగా భారతీయ విద్యార్థులకు ఏడాదికి 6 లక్షల 50 వేల రూపాయల ఫీజు ఉంటుంది.

ముంబైలోని జుహులో ఉన్న ఎకోల్ మోండియల్ వరల్డ్ స్కూల్ అంతర్జాతీయ స్థాయి పాఠశాల. ఈ పాఠశాల 2004లో ప్రారంభించారు. మీడియా కథనాల ప్రకారం, ఈ పాఠశాల వార్షిక రుసుము 9 లక్షల 90 వేల రూపాయలు. సీనియర్ సెక్షన్ ఫీజు 10 లక్షల 90 వేల రూపాయలు.

వెల్హామ్ బాలుర పాఠశాల ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లోని ఒక బోర్డింగ్ పాఠశాల. ఈ పాఠశాల 1937లో స్థాపించారు. మీడియా కథనాల ప్రకారం.. ఈ పాఠశాల వార్షిక ఫీజు 5 లక్షల 70 వేల రూపాయలు.