Breaking: హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ బదిలీ

Breaking: హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ బదిలీ


రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ బదిలీ అయ్యారు. ఆయనను లద్దాక్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.

జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ గతేడాది జులై 24న ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ధీరజ్ సింగ్ బదిలీ కావడంతో కొత్త చీఫ్ జస్టిస్ ఎవరు నియామకం అవుతారో చూడాలి.

ఇదిలా ఉంటే రాష్ట్రంలో బదిలీల పర్వం కొనసాగుతోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి పలువురు అధికారులు బదిలీ అవుతున్నారు. గత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారన్న కారణంతో పలు శాఖల్లో ప్రభుత్వం ప్రక్షాళన చేపట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రభుత్వ శాఖల్లోని అధికారులను బదిలీ చేసింది. శుక్రవారం సైతం పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.