తితిదే ఈవో ధర్మారెడ్డిని సెలవులో పంపిన ప్రభుత్వం

తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్‌ఛార్జ్‌ ఈవో ఏవీ ధర్మారెడ్డిని ప్రభుత్వం సెలవులో పంపింది. ఈ నెల 12న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.


తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్‌ఛార్జ్‌ ఈవో ఏవీ ధర్మారెడ్డిని ప్రభుత్వం సెలవులో పంపింది. ఈ నెల 12న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అనంతరం కుటుంబ సమేతంగా తిరుమల వెళ్లి మరుసటి రోజు శ్రీవారిని దర్శించుకోనున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ధర్మారెడ్డిని మంగళవారం నుంచి ఈ నెల 17 వరకు సాధారణ సెలవులపై పంపిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఆయన తిరుపతి దాటి వెళ్లేందుకు అనుమతించినా, రాష్ట్రంలోనే అందుబాటులో ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.