పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తొలిసారిగా నటిస్తోన్న హిస్టారికల్ మూవీ ‘హరి హర వీరమల్లు’. జ్యోతికృష్ణ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ కథానాయికగా కనిపించనుంది. ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు సినిమాలు, మరో వైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల లిస్ట్ చాలా పెద్దదే.. పవన్ కళ్యాణ్ చివరిగా బ్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఇప్పుడు ఓజీ సినిమాతో ప్రేక్షకులను అలరించనున్నారు. సాహో సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న సుజిత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచివిడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఓజీ సినిమాతో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఈ సినిమా షూటింగ్ కూడా సైలెంట్ గా జరుగుతోంది. ఇదిలా ఉంటే.. ఇక రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశారు.
తాజాగా పవన్ కళ్యాణ్ ఓ తమిళ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయా ఇంటర్వ్యూలో యాంకర్ రాజకీయాల్లో బిజీగా మారిపోయారు గా ఇక సినిమాలు చేయడం మానేస్తారా.? అని ప్రశ్నించారు. దానికి పవన్ కళ్యాణ్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. నాకు డబ్బు అవసరమైనంత కాలం సినిమాలు చేస్తూనే ఉంటాను. అయితే అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ జాబ్ విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వను అని పవన్ కళ్యాణ్ అన్నారు. దాంతో అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.
పవన్ కళ్యాణ్ లైనప్ చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. ప్రస్తుతం ఓజీ, హరిహరవీరమల్లు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఈ సినిమాల తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ రాజకీయాల్లో బిజీ అవ్వడంతో ఈ సినిమాల షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తున్నాయి. ఇక భవిషత్తులో పవన్ సినిమాలు కంటిన్యూ చేస్తా అని చెప్పడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.