Video: గాల్లోకి ఎగిరి, ఒంటి చేత్తో కళ్లు చెదిరే క్యాచ్.. మ్యాచ్ స్వరూపాన్నే మార్చిన అక్షర్.. వీడియో వైరల్

టీమిండియా తన చివరి సూపర్-8 మ్యాచ్‌లో 24 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. ఈ విజయంతో టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా సెమీఫైనల్‌కు చేరుకుంది. ఈ టోర్నీలో భారత జట్టు 5వ సారి టాప్-4కి చేరుకుంది.


జూన్ 27న రాత్రి 8:00 గంటలకు గయానా మైదానంలో జరిగే సెమీ ఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో భారత్ తలపడనుంది.

కాగా, ఈ మ్యాచ్‌లో పలు ఆసక్తికర ఘట్టాలు కనిపించాయి. మిచెల్ స్టార్క్‌పై రోహిత్ 4 సిక్సర్లు బాదాడు. ఆ తర్వాత జంపా వేసిన బంతికి పాండ్యా లైఫ్ అందుకున్నాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ మార్ష్ క్యాచ్‌ను మిస్ చేశాడు. రోహిత్ కొట్టిన ఒక సిక్స్ స్టేడియం పైకప్పును తాకింది. అక్షర్ అద్భుత క్యాచ్ పట్టగా, పేలవమైన కీపింగ్ కారణంగా రిషబ్ పంత్ కెప్టెన్ కోపానికి గురయ్యాడు. అలాగే, అక్షర్ పట్టిన ఓ అద్భుత క్యాచ్‌తో మ్యాచ్ టీమిండియా వైపు మళ్లింది. ఇలా ఎన్నో అద్భుత క్షణాలను ఈ మ్యాచ్ అభిమానులకు అందించింది.

అక్షర్ అద్భుత క్యాచ్..