‘త్వరలో కశ్మిర్ ఫైల్స్ తరహాలో విశాఖ ఫైల్స్’..టీడీపీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు

www.mannamweb.com


ఏపీలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించి..నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో నాలుగోసారి ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టారు.

ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు రాష్ట్రాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. నేడు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాష్ట్ర అభివృద్ధి పై కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే కశ్మీర్ ఫైల్స్ తరహాలో విశాఖ ఫైల్స్ విడుదల చేస్తామని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. విశాఖలో వైసీపీ భూదందాల పై ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు.

విశాఖ భూ ఆక్రమణలో సీఎస్ స్థాయిలో పని చేసిన వ్యక్తులున్నారని ఆరోపించారు. కొత్తగా ఆక్రమణలకు తావులేకుండా పంచగ్రామాల సమస్య పరిష్కరిస్తామన్నారు. అభివృద్ధిపైనే సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారని ఆయన పేర్కొన్నారు.