దీపావళికి ముందు నరక చతుర్దశి ఎందుకు జరుపుకుంటారు? ఈ ఏడాది ఎప్పుడు వచ్చిదంటే

www.mannamweb.com


హిందూ మతంలో నరక చతుర్థి పండుగను ప్రతి సంవత్సరం ఆశ్వయుజమాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి రోజున జరుపుకుంటారు. ఈ పండుగను దీపావళికి ఒక రోజు ముందు జరుపుకుంటారు.

దీనిని నరక చతుర్దశి, కాళీ చతుర్దశితో పాటు ఛోటీ దీపావళి అని కూడా పిలుస్తారు. ఈ రోజున మృత్యుదేవతగా భావించే యమ ధర్మరాజును పూజించే సంప్రదాయం ఉంది. ఈ రోజున ఇంట్లో సాయంత్రం ఇంటి దక్షిణ దిశలో, దీపావళి వంటి ఇతర ప్రదేశాలలో యముడి పేరుతో యమ దీపం వెలిగించే సంప్రదాయం ఉంది. అందుకే నరక చతుర్దశిని ఛోటీ దీపావళి అని కూడా పిలుస్తారు. నరక చతుర్దశిని ఎందుకు జరుపుకుంటారు అనే విషయంపై అనేక పురాణ కథనాలు ప్రబలంగా ఉన్నాయి.

నరక చతుర్దశి ఎప్పుడు?

పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం ఆశ్వయుజ మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి తిథి అక్టోబరు 30 ఉదయం 01:15 గంటలకు ప్రారంభమవుతుంది. మర్నాడు అక్టోబర్ 31 న మధ్యాహ్నం 03:52 గంటలకు ముగుస్తుంది. ఈ నేపధ్యంలో నరక చతుర్దశిని 31 అక్టోబర్ 2024న జరుపుకుంటారు.

నరక చతుర్దశికి సంబంధించిన పురాణం

పూర్వకాలంలో నరకాసురుడు అనే క్రూరమైన రాక్షసుడు ఉండేవాడు. తన దురాగతాలతో స్వర్గంలోనూ, భూమిలోనూ పెను విధ్వంసం సృష్టించాడు. ఋషులను, సాధువులను, దేవతలను కూడా ఇబ్బంది పెట్టాడు. నరకాసురుడి వలన మానవులే కాదు దేవతలందరూ కూడా ఇబ్బంది పడ్డారు. చాలా మంది రాజులను, 16,000 వేల మంది రాజ కుమార్తెలను బంధించాడు. వారిని బలవంతంగా వివాహం చేసుకోవాలనుకున్నాడు.

నరకాసురుడి దుశ్చర్యలతో కలత చెంది ఒకరోజు దేవతల అధినేత ఇంద్రుడు శ్రీకృష్ణుడి వద్దకు వెళ్లి నరకాసురుడి దురాగతాలన్నీ చెప్పాడు. నరకాసురుడు నుంచి తమకు విముక్తి ఇవ్వమని కోరుకున్నాడు. అయితే నరకాసురుడు మరణం స్త్రీ చేతిలో అన్న శాపం గురించి శ్రీ కృష్ణుడికి తెలుసు. అందుకనే శ్రీకృష్ణుడు తన భార్య సత్యభామతో కలిసి నరకాసురుడిపై యుద్ధం చేయడానికి వెళ్ళాడు. కృష్ణుడు ముర అనే రాక్షసుడిని, అతని 6 మంది కుమారులను ఎదుర్కొన్నాడు., శ్రీకృష్ణుడు తన భార్య సహాయంతో చంపాడు.

తన కుమార్తెల మరణ వార్త విన్న నరకాసురుడు తన సైన్యంతో శ్రీ కృష్ణుడితో యుద్ధం చేయడానికి వచ్చాడు. అప్పుడు శ్రీకృష్ణుడు తన భార్య సత్యభామను రథసారథిగా చేసి సత్యభామ సహాయంతో నరకాసురుడిని సంహరించాడు. నరకాసురుని సంహరించిన తరువాత శ్రీ కృష్ణుడు తన కుమారుడు భగదత్తకు నిర్భయ వరాన్ని అనుగ్రహించి ప్రాగ్జ్యోతిష్య పురానికి రాజుగా చేశాడు. నరకాసురుని వధించిన రోజు ఆశ్వయుజ మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి కనుక ఈ తిధిని నరక చతుర్దశి అంటారు. ఈ రోజున శ్రీకృష్ణుడు 16 వేల మంది బాలికలను నరకాసురుని చెర నుండి విడిపించాడు, నరకాసురుడి బాధల నుంచి విముక్తి లభించడంతో మర్నాడు దీపాలు వెలిగించి ప్రజలు సంబరాలు చేసుకున్నారు.

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి