వాషింగ్ పౌడర్ నిర్మా ఇప్పుడు ఎందుకు కనిపించడం లేదు.. నిర్మా యాడ్‌లో కనిపించిన పాప ఎవరు ?

‘టయ్.. వాషింగ్ పౌడర్ నిర్మా.. వాషింగ్ పౌడర్ నిర్మా.. పాలల్లోనా తెలుపు.. నిర్మాతో వచ్చింది.. రంగుల బట్టలే తళతళలా మెరిశాయి. అందరూ మెచ్చినదే నిర్మా.. వాషింగ్ పౌడర్ నిర్మా.. హేమా..రేఖా..జయ..సుష్మా. అందరూ మెచ్చే నిర్మా’ ఈ పాట ఏ ప్రొడక్ట్ ప్రకటనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతలా ఆ పాట ఆకట్టుకోవడమే కాదు.. ఆ డిజర్జెంట్ పౌడర్ కూడా మెప్పించింది. ఇప్పుడంటే చాలా సర్ఫ్ ఉత్పత్తులు వచ్చాయి కానీ.. ఒకప్పుడు నిర్మాదే హవా. ప్రతి మహిళ దీన్ని వినియోగించిన వాళ్లే. దశాబ్దాలకు పైగా తిరుగులేని ఉత్పత్తిగా నిలిచింది. కానీ ఇప్పుడు ఈ సర్ఫ్ కొనేవారే కాదు వాడేవారు కూడా తక్కువ అయ్యారు. ఈ వాషింగ్ పౌడర్ కూడా అంతగా కనిపించటడం లేదు. అలాగే ఆ ప్యాకెట్ మీద ఉన్న అమ్మాయి ఎవరు అనే డౌట్ కూడా వస్తుంది. ఇంత మంచి ఉత్పత్తిని అందించిన ఆ వ్యక్తి ఎవరు… తెలుసుకుందాం


ఒకప్పుడు దుస్తులు పువ్వుల్లా మెరవాలంటే మహిళలు ఉప్పు, సోడా వంటి వాటితో దుస్తులు శుభ్రం చేసుకునేవారు. దీంతో దుస్తులు త్వరగా పాడైపోయేవి. 1960వ దశకంలో వస్త్రాలను శుభ్రం చేసే ప్రక్రియకు ప్రత్యామ్నాయంగా వచ్చిందే నిర్మా వాషింగ్ పౌడర్‌. ఇది వచ్చాక విపరీతంగా మహిళలను ఆకట్టుకుంది. అప్పట్లో మరో ఆప్షన్ కూడా ఉండేది కాదు. దీంతో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అలాగే ఆ సమయంలో మార్కెట్‌లో నంబర్ 1 ప్రొడక్ట్‌గా అవతరించింది. ఈ వాషింగ్ పౌడర్ సృష్టి కర్త ఎవరంటే.. కర్బన్ బాయ్ పటేల్. అతడో బిజినెస్ మ్యాన్. ఇప్పటికీ ధనవంతుల జాబితా తీస్తే ఆయన పేరు ఉంటుంది. గుజరాత్‌లోని నిరుపేద కుటుంబంలో జన్మించిన ఆయన కెమిస్ట్రీలో బీఎస్సీ పూర్తిచేశాడు. ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగం చేశాడు. అయితే డిటర్జెంట్‌ను తయారు చేయాలనే లక్ష్యంతో ఉద్యోగాన్ని వదిలివేశాడు. తనకున్న కెమిస్ట్రీ నాలెడ్ట్ ఉపయోగించి తన ఇంటి వద్దనే సర్ఫ్ తయారు చేశాడు.


ఇక ఆ ప్యాకెట్ పై కనిపించే ఆ బాలిక ఎవరంటే. కర్బన్ భాయి పటేల్ కూతురు నిరుపమ. తన కూతురు రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. ఆమె జ్ఞాపకార్థం తాను తయారు చేసిన వాషింగ్ పౌడర్‌కు “నిర్మా వాషింగ్ పౌడర్”గా పేరు పెట్టాడు తండ్రి. వాషింగ్ పౌడర్ ప్యాకెట్‌పై నిర్మాకు గుర్తుగా ఆ పాప ఫోటోను ఉంచాడు. తొలుత సైకిల్‌పై ఇంటింటికి తిరుగుతూ ఈ డిటర్జెంట్ పౌడర్ అమ్మేవాడు. ఈ పౌడర్‌కు ఆదరణ లభించడంతో సంస్థ ఎదగడం స్టార్ అయ్యింది. ఒక చిన్న ఫ్యాక్టరీ స్థాపించి వాషింగ్ పౌడర్ తయారీ మొదలు పెట్టాడు. నిర్మా పౌడర్ ప్రమోషన్ కోసం, రేడియోలో ప్రకటనలు ఇచ్చారు. కొంత కాలానికి టీవీలో ప్రకటనలు ఇవ్వడం ప్రారంభించారు. అలా వచ్చిందే నిర్మా సాంగ్. అప్పట్లో మార్కెట్‌లో హిందూస్థాన్ యూనిలివర్ కంపెనీ వాషింగ్ పౌడర్‌ అగ్రగామిగా ఉండేది.

కానీ తక్కువ ధరకే మంచి క్వాలిటీ ప్రొడక్ట్ దొరకడం, సామాన్యులు సైతం కొనగలిగేలా ఉండటంతో కొంతకాలంలోనే నిర్మా వాషింగ్ పౌడర్ మార్కెట్‌లో నంబర్ స్థానానికి చేరింది. నిర్మా కంపెనీ కొంత కాలం తర్వాత డిటర్జెంట్ కేక్స్ అంటే సోప్స్ కూడా తయారు చేసింది. అయితే కొన్ని దశాబ్దాల పాటు మార్కెట్ శాసించిన నిర్మా వాషింగ్ పౌడర్ కు పోటీగా మరిన్ని ఉత్పత్తులు రావడం స్టార్ట్ అయ్యాయి. ఆ కాంపిటీషన్ తట్టుకుని నిలబడలేకపోయింది. మార్కెట్‌లో వస్తున్న కొత్త కొత్త బ్రాండ్స్ కారణంగా నిర్మాకు ఆదరణ పూర్తిగా తగ్గిపోయింది. ఆ తర్వాత కర్సన్ భాయ్ పటేల్ వేర్వేరు బిజినెస్‌లు చేశాడు. నిర్మా గ్రూప్ 2014లో సిమెంట్ తయారీ మొదలుపెట్టింది. కర్సన్ భాయ్ పటేల్ ప్రస్తుతం ఇండియాలో మిలియనీర్లలో ఒకరు. అతని అతి ఆస్తి విలువ 4.9 బిలియన్ డాలర్లు.