ఎవరీ శ్రావ్య..? కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు భార్య ఎవరి కూతురో తెలుసా..? చంద్రబాబు దగ్గరుండి మరీ..!

ఎవరీ శ్రావ్య..? కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు భార్య ఎవరి కూతురో తెలుసా..? చంద్రబాబు దగ్గరుండి మరీ..!


కింజారాపు రామ్మోహన్ నాయుడు గారు పుట్టింది. 1987 వ సంవత్సరం డిసెంబర్ 18 వ తారీఖున.. శ్రీకాకుళం పార్లమెంట్ సీటు నుంచి ఎంపీ గా ఎన్నికైంది 2014 వ సంవత్సరంలో అంటే ఎంపీ గా గెలిచే నాటికి ఆయన వయసు అక్షరాల 26 ఏళ్ల వయసు.

ఎస్ అతి చిన్న వయసులోనే ఎంపీ గా గెలిచిన వ్యక్తి కింజారపు రామ్మోహన్ నాయుడు.. ఇంకా చెప్పాలంటే ఆయనకు ఆనాటికి అసలు పెళ్లే కాలేదు. 28 ఏళ్ల వయసులో చక్కగా ఓ ఇంటి వాడయ్యాడు. 2019లో వైసపి వేవ్ రాష్ట్రమంతా ఉన్నా సరే ఆయన గెలుపును మాత్రం జగన్ వేవ్ అడ్డుకోలేకపోయింది. రెండోసారి కూడా ఎంపీ గా గెలిచేశారు. తాజాగా మరోసారి 2024 ఎన్నికల్లో ఎంపీ గా విజయం సాధించడమే కాకుండా, ఏకంగా కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేసేసారు.

గతంలో ప్రధానమంత్రులుగా పని పనిచేసిన దేవగౌడ ఐకే గుజరాల, క్యాబినెట్లలో 1996 నుంచి 1998 వరకు అంటే రెండేళ్ల పాటు కింజారపు ఎర్రన్ నాయుడు గారు కేంద్ర మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఆయన తనయుడే అదే పార్లమెంట్ సీట్లో నుంచి గెలిచి 28 ఏళ్ల తర్వాత కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం అన్నది అరుదైన విషయంగా చెప్పుకోవచ్చు. వరుసగా మూడు సార్లు గెలిచే క్రమంలో ఎంపీ గా ఆయన ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి… ఆయన భార్య ఎవరు ఎవరి కూతుర్ని ఆయన పెళ్లి చేసుకున్నారు… వాళ్ళ పెళ్లి వెనక జరిగిన తతంగం ఏమిటి అన్నది… .క్లారిటీగా క్లియర్ గా చెప్పుకుందాం…

కింజారాపు రామ్మోహన్ నాయుడు గారు 1987 డిసెంబర్ 18 వ తారీఖున శ్రీకాకుళం జిల్లాలోని నిమ్మాడలో జన్మించాడు.. ఆయన తండ్రి గారి పేరు ఎర్ర నాయుడు ,తెలుగుదేశం పార్టీలో మోస్ట్ సీనియర్ లీడర్ ఆయన నడిచి వస్తుంటే, ఎంతటి ప్రత్య అయినా సరే వణికి పోవాల్సిందే, నుదిన బొట్టు ఆయనలోని ప్రత్యేకత ఆయన హరిశ్చంద్రపురం శాసన సభ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగు సార్లు పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగు సార్లు ఎంపిగా అయ్యారు. 1996, 98 మధ్య కాలంలో కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు. 2012 వ సంవత్సరంలో నవంబర్ రెండో తారీకున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎర్ర నాయుడు గారు ప్రాణాలు కోల్పోయారు. ఆయన చనిపోయే నాటికి కొడుకు రామ్మోహన్ నాయుడు అమెరికాలో చదువుకుంటూ ఉన్నారు.

రామ్మోహన్ నాయుడు గారు ఒకటో తరగతి నుంచి మూడో తరగతి వరకు శ్రీకాకుళంలోని గురజాడ ఎడ్యుకేషన్ సొసైటీ హాస్టల్ లో ఉండి చదువుకున్నాడు. 1994 లో ఎర్ర నాయుడు గారు తెలుగుదేశం పార్టీ చీఫ్ వ్యూ గా వెన్నుముకయ్యారు. ఆయన రాజధాని హైదరాబాద్ లో ఎక్కువగా ఉండాల్సి వచ్చింది. దీంతో పిల్లలతో సహా కుటుంబం అంతా కలిసి శ్రీకాకుళం నుండి హైదరాబాద్ కు షిఫ్ట్ అయింది . భారతీయ విద్యాభవన్లో నాలుగు ఐదు తరగతులను రామ్మోహన్ నాయుడు గారు చదువుకున్నారు. ఆ తర్వాత 1996 ఎన్నికల్లో ఎర్రంనాయుడు లోక్సభ సభ్యుడిగా గెలుపొందారు. దీంతో ఆయనకు కేంద్ర మంత్రిగా అవకాశం రావడంతో రామ్మోహన్ నాయుడు గారి చదువు మళ్ళీ ఢిల్లీకి షిఫ్ట్ అయింది. 1998 నుంచి 2004 వరకు అంటే ఇంటర్ వరకు ఢిల్లీ లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో చదివారు. ఆ తర్వాత అమెరికాలోని స్లోని విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో పట్టభద్రులయ్యారు. ఆ తర్వాత లాంగ్ విశ్వవిద్యాలయంలో ఎంబిఏ పూర్తి చేశారు. పట్టభద్రులయ్యాక ఒక సంవత్సరం పాటు సింగపూర్ లో ఉద్యోగం పనిచేసి స్వదేశానికి తిరిగి వచ్చారు. రామ్మోహన్ నాయుడు గారు ఆయన ఢిల్లీలో ఉండి చదువుకోవడం వలన ఆయనకు హిందీ మీద మంచి పట్టు దక్కింది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎంపీ లకు పెద్దగా హిందీ రాదు. పార్లమెంట్ లో మాట్లాడాల్సిన సందర్భం వస్తే గనుక అందరూ కూడా ఇంగ్లీష్ లోనే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అయితే రామ్మోహన్ నాయుడు గారు మాత్రం హిందీలో దంచి కొట్టేవారు.

మొదట్లో రాజకీయాలు అంటే రామ్మోహన్ నాయుడుకి ఇష్టం లేకపోయినా ఆసక్తి లేకపోయినా చంద్రబాబు గారు పదే పదే చెప్పడంతో కుటుంబ సభ్యులు కూడా ఒత్తిడి చేయడంతో టిడిపి లో చేరారు. తండ్రి వారసత్వాన్ని తీసుకున్నారు. ఎంపీ గా పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. 2013 లో టిడిపి నుంచి రాష్ట్ర రాజకీయాల్లోకి చురుకుగా పని చేయడం మొదలు పెట్టారు. 2013 వ సంవత్సరం అక్టోబర్ నెలలో ఆంధ్రప్రదేశ్ విభజన మీద పోరాటంలో ఆనాటి మాజీ సీఎం చంద్రబాబు గారికి మద్దతుని ఇస్తూ ఢిల్లీలో నిరాహార దీక్షలో కూడా కూర్చున్నారు. ఇక 2014 ఎన్నికల్లో శ్రీకాకుళం లోక్సభలో పోటీ చేసి మొదటిసారి పోటీ చేసి 127576 ఓట్ల మెజారిటీతో గెలిచి ప్రభంజనం సృష్టించారు. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఆంధ్రకు కేంద్రం విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఇస్తామని దాన్ని పట్టించుకోవడం లేదని 2018 అక్టోబర్ లో ఆముదాల వసలు రైల్వే స్టేషన్ లో రాత్రంతా ప్లాట్ఫారం మీదే కూర్చొని నిరసన వ్యక్తం చేశారు.

ఇక 2019 ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన 60653 ఓట్ల మెజారిటీ తో గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో టిడిపి నుంచి కేవలం ముగ్గురు ఎంపీలు మాత్రమే గెలవగా వారిలో రామ్మోహన్ నాయుడు గారు ఒక్కరు. ఈ సందర్భంగా ఓ విషయాన్ని అయితే తప్పకుండా చెప్పుకొని తీరాలి. 2024 ఎన్నికలకు ముందు పార్లమెంట్ లో రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. ఏపీ కి సంబంధించిన సమస్యలపై మాట్లాడుతూ ఉంటే టైం అయిపోయిందంటూ పదే పదే మైక్ ను కట్ చేస్తూ ఉన్నారు. వాస్తవానికి పార్టీల వారిగా వారికి ఉన్న సంఖ్యా బలాన్ని బట్టి మాట్లాడే సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు రామ్మోహన్ నాయుడు గారికి ఇచ్చిన టైం అయిపోవడంతో మైక్ కట్ చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రామ్మోహన్ నాయుడు గారు వచ్చే ఎన్నికల్లో భారీ సంఖ్యలో ఎంపీ సెట్లతో ఈ సభలోకి వస్తాం అప్పుడు మాకు కావాల్సిన టైం మాకు ఉంటుంది అంటూ లోక్ సభలోనే సవాలు తీశారు. అన్నట్టుగానే ఇప్పుడు టిడిపి భారీ సంఖ్యలో సీట్లను గెలిచింది. ఎన్డిఏ లో రెండో అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఎన్డిఏ లో కీలకంగా మారింది. ఇప్పుడు నిజంగానే కేంద్ర మంత్రి హోదాలో రామ్మోహన్ నాయుడు గారు ఎంతసేపు మాట్లాడాలంటే అంత సేపు మాట్లాడొచ్చు.

ఇక చివరగా రామ్మోహన్ నాయుడు గారి వ్యక్తిగత జీవితం విషయానికి వద్దాం ఎంపీ గా గెలిచిన తర్వాతే 28 ఏళ్ల వయసులో ఆయనకు పెళ్లి అయిందని మనం చెప్పుకున్నాం కదా. 2017 వ సంవత్సరం జూన్ నెలలో శ్రావ్య గారితో రామ్మోహన్ నాయుడు గారికి పెళ్లి అయింది. అయితే శ్రావ్య గారు ఎవరు ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటి, వారిది ప్రేమ పెళ్ళా అని చాలా మంది డౌట్ పడుతూ ఉంటారు. అయితే రామ్మోహన్ నాయుడు గారి పెళ్లి అనుకోకుండా శ్రావ్య గారితోనే కుదిరింది. రామ్మోహన్ నాయుడు గారు బండారు అప్పల నాయుడు చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్స్,, ఒకే కాలేజీలో చదువుకున్నారు కూడా ఆ బండారు అప్పల నాయుడు ఎవరో కాదు, టిడిపి సీనియర్ నేత ప్రస్తుతం టిడిపి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తికి గారి కొడుకే, స్నేహితుడే కాబట్టి రామ్మోహన్ నాయుడు గారి గురించి అన్ని విషయాల క్షణం గా తెలుసు కాబట్టి తన సోదరికి పెళ్లి సంబంధాలు చూసిన శ్రమను తగ్గించింది. ఆల్రెడీ అప్పటికే రాజకీయంలోకి ఇచ్చి ఎంపీ గా గెలిచిన రామ్మోహన్ నాయుడుకి ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందని ఆలోచన అప్పల్ నాయుడుకి వచ్చింది. దీంతో ఇదే విషయాన్ని తండ్రితో చెప్పి ఇంట్లో చెప్పి ఒప్పించారు.

ఆ తర్వాత రామ్మోహన్ నాయుడు గారితో కూడా మాట్లాడాడు. పెళ్లి కోసం అంటూ కాదు గాని ఓసారి పర్సనల్ గా మా చెల్లెమ్మను కలువు మాట్లాడు నీకు నచ్చితేనే ప్రొసీడ్ అవుదాము. అంటూ చెప్పేసరికి రామ్మోహన్ నాయుడు గారు సరే అని అన్నారు .ఆ తర్వాత శ్రావ్యతో ఓ ఫ్యామిలీ ఫంక్షన్ లో కలిసి మాట్లాడారు. ఇద్దరి మనసులు కలిసాయి. దీంతో ఇరు కుటుంబాలు కూడా ప్రొసీడ్ అయ్యాయి. మొత్తానికి ఓ టీడిపి సీనియర్ నేతకు చెందిన కొడుకు మరో టీడిపి సీనియర్ నేతకు చెందిన కూతురికి 2017 వ సంవత్సరం జూన్ నెలలో టీడిపి అధికారంలో ఉన్న సమయంలోనే పెళ్లి జరగడంతో ఆనాడు తెలుగుదేశం పార్టీ నేతలంతా ఆ పెళ్లిలోనే తెగ హంగామా చేశారు. అంగరంగ వైభవంగా ఆ పెళ్లి జరిగింది ఏడేళ్ల వారి వైవాహిక జీవితానికి తీపి గుర్తుగా ఓ కూతురు కూడా వారికి జన్మించింది. ఓవైపు ఫ్యామిలీ మరోవైపు పార్టీ ఇంకోవైపు ఎంపీ గా విధులు ఇలా క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్న రామ్మోహన్ నాయుడు గారికి ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ప్రమోషన్ లభించింది.