YS Jagan: ‘ఆగప్పా.. ఫ్లో పోతుంది కదా’

www.mannamweb.com


YS Jagan: ‘ఆగప్పా.. ఫ్లో పోతుంది కదా’

నరసరావుపేట: ‘సార్‌ బాధిత కుటుంబానికి మీరు ఏం భరోసానిచ్చారు?’ అని జగన్‌ను ఓ విలేకరి ప్రశ్నించగా.. ‘ఆగప్పా.. చెప్పేటప్పుడు ఫ్లో పోతుంది కదా! ఎంత నువ్వు ఆంధ్రజ్యోతి విలేకరివి అయితే మాత్రం మధ్యలో అడగడం ధర్మం కాదు కదా!’ అంటూ ‘ఏం చెబుతున్నాను?’ అని తలపై వేలుపెట్టుకుని మననం చేసుకున్నారు. వెంటనే పక్కనున్న మాజీ ఎంపీ వేణుగోపాల్‌రెడ్డి, మాజీమంత్రి అంబటి రాంబాబు కలుగజేసుకుని దిల్లీలో ధర్నా గురించి చెబుతున్నారని అనడంతో జగన్‌ మళ్లీ ఆ అంశంపై మాట్లాడటం కొనసాగించారు. అయితే మధ్యలో ప్రశ్న వేసింది ఆంధ్రజ్యోతి విలేకరి కాకపోవడం గమనార్హం.

మరోవైపు పరామర్శకు వచ్చిన జగన్‌ అమ్మఒడి, విద్యాదీవెన, సున్నావడ్డీ రుణాలంటూ హతుడి కుటుంబసభ్యుల ముందు ఏకరువు పెట్టడంతో అంతా ఆశ్చర్యపోయారు. కొడుకు పోయి దుఃఖంలో ఉన్నవారిని ఓదార్చే తీరు ఇదా అంటూ పలువురు సామాజిక మాధ్యమాల వేదికగా విమర్శిస్తున్నారు.