పవన్ కుమారుడికి ప్రమాదం..స్పందించిన వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చిన్న కుమారుడు ( Son) మార్క్ శంకర్ ( Mark Shankar ) అగ్ని ప్రమాదంలో గాయపడ్డాడు.


అయితే ఈ ప్రమాద సంఘటనలో పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడిన సంఘటనపై… తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ( YS Jaganmohan Reddy ) స్పందించారు. ఈ సంఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు జగన్. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు.. సోషల్ మీడియా వేదికగా ట్విట్ చేశారు వైయస్ జగన్మోహన్ రెడ్డి.

ఈ అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ కుమారుడు గాయపడ్డాడని తెలిసి షాక్ అయినట్లు వివరించారు. ఈ క్లిష్ట పరిస్థితులలో ఆ కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. పవన్ కళ్యాణ్ కొడుకు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు పోస్ట్ పెట్టారు జగన్ ( YS Jaganmohan Reddy). ఇది ఇలా ఉండగా… సింగపూర్ లో పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ( Mark Shankar ) అగ్ని ప్రమాద సంఘటన తెలియగానే హుటాహుటిన బయలుదేరారు పవన్ కళ్యాణ్.

మన్యం జిల్లా పర్యటనను ముగించుకొని.. సింగపూర్ వెళ్తున్నారు. ఇక ఈ ప్రమాదంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ చేతులు అలాగే కాళ్లకు తీవ్రమైన గాయాలు అయినట్లు చెబుతున్నారు. సింగపూర్ లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో శంకర్ కు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం మార్క్ శంకర్ ఆరోగ్యం స్థిరంగానే ఉందని… ఆందోళన అవసరం లేదని తెలుస్తోంది.