విజయవాడ నుంచి తెనాలికి పల్లెవెలుగు బస్సెక్కిన వైఎస్ షర్మిల.. ఎందుకంటే?

www.mannamweb.com


ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి.. ఆర్టీసీ బస్సులో ప్రయాణించి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీపై నిలదీశారు. విజయవాడ నుంచి తెనాలికి ఆమె ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. మహిళా ప్రయాణికుల పక్కనే కూర్చుని వారితో ఆమె మాట్లాడారు. ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలు కాకపోవడంపై మహిళల ఉద్దేశం ఏంటో ఆమె తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఫ్రీ బస్సు కోసం తామంతా ఎదురుచూస్తున్నట్లు ఈ సందర్భంగా ఆమెకు వారు చెప్పారు. దీంతో ఉచిత బస్సు ప్రయాణం హామీ కోసం గట్టిగా కూటమి ప్రభుత్వాన్ని నిలదీయాలని షర్మిల మహిళా ప్రయాణికులకు సూచించారు. అలాగే ప్రభుత్వాన్ని కూడా వెంటనే ఈ హామీ అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఇప్పటికే ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా చంద్రబాబు నాయుడు పాలసీల పేరుతో టైంపాస్ చేస్తున్నారంటూ మీడియా ముందు షర్మిల విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.