సమ్మక్కసారక్క జాతర భక్తులకు వాటర్ ప్యాకెట్ల పంపిణీ

పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్ కి చెందిన స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు ఈ రోజు తుర్కల మద్దికుంట లో నిర్వహిస్తున్న సమ్మక్క సారక్క జాతరలో భక్తులకు వాటర్ ప్యాకెట్ల పంపిణీ చేసినట్లు గాయత్రి విద్యా సంస్థల ఛైర్మన్ అల్లెంకి శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగం యొక్క వ్యవస్థాపకుడు అయిన లార్డ్ బాడెన్ పావెల్ గారి జన్మదినం సందర్భంగా ఈ రోజు జాతరకు విచ్చేసిన భక్తకోటి దాహార్తి తీర్చడానికి వాటర్ ప్యాకెట్ల పంపిణీ చేయడం జరిగింది. చిన్నతనం నుండే విద్యార్థులలో సేవాభావం, క్రమ శిక్షణ, దేశ భక్తి తదితర గొప్ప లక్షణాలను పెంపొందించడానికి మా పాఠశాలలో స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్ ని ఏర్పాటు చేశామని, అందులో భాగంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. భక్తుల దాహార్తి తీర్చిన స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులను జాతర నిర్వాహకులు అభినందించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ రజనీ శ్రీనివాస్, ప్రిన్సిపాల్ విజయ్, గైడ్ కెప్టెన్ స్రవంతి, రజియుద్దీన్, నవీన్, పాల్గొన్నారు.