సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా నోటిఫికేషన్ ఎలా ఇస్తారు?:డీఎస్సీ నోటిఫికేషన్‌పై హైకోర్టు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ పై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మరియు జస్టిస్ రఘునందనరావు ధర్మాసనం ముందు విచారణ జరిగింది.
పిటిషనర్ తరపున ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. ఎస్జీటీ టీచర్ పోస్టులకు B.Ed అభ్యర్థులను కూడా అనుమతించడం సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకమని పిటిషనర్ తరఫు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదించారు. బీఈడీ అభ్యర్థులను అనుమతించడం వలన లక్షల మంది డీఎడ్ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దేశ అత్యున్నత న్యాయస్థానం మరియు ఎన్సిటిఈ నిబంధనలుకు పూర్తిగా వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖాళీల ప్రక్రియ చేపట్టిందని వాదించారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

తప్పులతడకగా నోటిఫికేషన్ విడుదల చేసి లక్షలాదిమంది జీవితాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆడుకుంటుందన్న పిటిషనర్ తరఫు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదించారు. ఒక్కరోజు గడువు కోరిన ఏజీSGTఅభ్యర్థులు తక్కువగా ఉన్న కారణంగా B.Ed అభ్యర్థులను అనుమతించాల్సి వస్తుందన్న అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ హైకోర్టులో వాదనలు వినిపించారు.
అర్హత సాధించిన బి.ఎడ్ అభ్యర్థులు రెండు సంవత్సరాల బ్రిడ్జి కోర్సు చేసిన తర్వాతే తరగతుల గదిలోకి అనుమతిస్తామని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వెల్లడించారు. అయితే ప్రభుత్వ వాదనతో ధర్మాసనం ఏకీ భవించలేదు.

సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా నోటిఫికేషన్ ఎలా ఇస్తారంటూ ఏజీని ధర్మాసనం ప్రశ్నించింది. బ్రిడ్జి కోర్సుకి చట్టబద్ధత ఏముంది అని ఏజీని ప్రశ్నించింది. తక్షణమే నోటిఫికేషన్ నిలుపుదల చేస్తాం అంటూ ధర్మాసనం ఉత్తర్వులకు సిద్ధపడింది. ఒక్కరోజు ప్రభుత్వ వివరణ తీసుకోవడానికి సమయం కావాలని ఏజి అభ్యర్థించారు.

Related News

23 నుంచి హాల్ టికెట్లు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతుందన్న పిటీషనర్ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వెల్లడించారు. హాల్ టికెట్లు జారీ చేయకుండా ఉత్తర్వులు ఇస్తామని ధర్మాసనం తెలిపింది. అడ్వకేట్ జనరల్ అభ్యర్థుల మేరకు విచారణ బుధవారానికి వాయిదా వేసింది. ఎటువంటి పరిస్థితుల్లో నోటిఫికేషన్ కొనసాగటానికి వీలులేదని ధర్మాసనం స్పష్టం చేసింది.

సుప్రీంకోర్టు నిబంధనలు అమలు కావాలి కదాఇకపోతే సోమవారం సైతం ఈ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనుమతించడం వల్ల డీఎడ్ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతారని పిటిషనర్ తరఫు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. ఇది సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధమని వాదించారు. భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం నిబంధనలకు విరుద్ధంగా ఖాళీల భర్తీ చేపట్టడం కోర్టు ధిక్కారమేనని వాదించారు.

అయితే ఈ పిటిషన్‌పై వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి సుప్రీంకోర్టు నిబంధనలు అమలు కావాలి కదా? అని ప్రభుత్వ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. నోటిఫికేషన్ విడుదల చేసిన మంత్రి బొత్సరాష్ట్రంలో 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన DSC-2024 నోటిఫికేషన్‌ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఈమేరకు సోమవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్సీ నోఫికేషన్‌ను విడుదల చేయడంతో పాటు డీఎస్సీ నిర్వహణకు సంబంధించి పూర్తి వివరాలతో కూడిన జిఓలు 11,12 లను కూడా మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు.

అలాగే డీఎస్సీ 2024 సంబంధించిన వెబ్ సైట్ http//cse.gov.in కూడా మంత్రి బొత్స ప్రారంభించారు. DSC- 2024కు సంబంధించి నోటిఫికేషన్‌కు సంబంధించి ఈనెల 12 నుండి 21 వరకూ అభ్యర్ధులు ఆన్లైన్ విధానంలో ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. ఈనెల 22 వరకూ అన్లైన్ లో ధరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు. మార్చి 5వ తేదీ నుండి హాల్ టిక్కెట్లను ఆన్లైన్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చని స్పష్టం చేశారు. మార్చి 15 నుండి 30 వరకూ డీఎస్సీ 2024 వరీక్షలు జరుగుతాయని వచ్చిన ధరఖాస్తులు ఆధారంగా మొత్తం పరీక్షా కేంద్రాలు ఎన్ని అనేది నిర్ణయించడం జరుగుతుందని పేర్కొన్నారు.భర్తీ చేయనున్న ఖాళీల వివరాలు:మొత్తం పోస్టులు:
6,100స్కూల్ అసిస్టెంట్లు: 2,299ఎస్జీటీల సంఖ్య: 2,280పీజీటీలు: 215టీజీటీలు: 1,264ప్రిన్సిపాల్స్: 42ముఖ్యమైన తేదీలుఆన్లైన్ విధానంలో ఫీజు చెల్లింపు గడువు: ఫిబ్రవరి 12 నుంచి ఫిబ్రవరి 21 వరకుదరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: ఫిబ్రవరి 22హాల్ టికెట్ల డౌన్‌లోడ్: మార్చి 5 నుంచి ప్రారంభంపరీక్షా విధానం: కంప్యూటర్ బేస్డ్ విధానంపరీక్ష జరిగే తేదీలు: మార్చి 15 నుంచి మార్చి 30 వరకుపరీక్షా సమయం: ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు(ఫష్ట్ సెషన్)మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు(సెకండ్ సెషన్)ఇతర ముఖ్యమైన సమాచారంహెల్ప్ డెస్క్ ఫోన్ నంబర్లు- 9505619127, 9705655349ప్రత్యేక వెబ్ సైట్: http//cse.gov.in పేరుతో ప్రారంభం2018 సిలబస్ ప్రకారమే డీఎస్సీ పరీక్షల నిర్వహణవయోపరిమితి: జనరల్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి 44 ఏళ్లు, రిజర్వుడ్ కేటగిరీ అభ్యర్థులకు మరో ఐదేళ్లు పెంపు

Related News