ఓరీ దేవుడో.. మహిళ కిడ్నీలో 300 రాళ్లు..! కారణం తెలిసి వైద్యులే షాక్..

ఓ మహిళ కిడ్నీ నుంచి 300కు పైగా రాళ్లను తొలగించారు వైద్యులు. ఆ స్త్రీ తన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడానికి నీళ్లకు బదులు ప్రతిరోజూ శీతల పానీయాలు, జ్యూస్ లు మాత్రమే తాగేది. ఈ కృత్రిమ స్వీటెనర్లను ఉపయోగించి తయారు చేసిన పానీయాన్ని అతిగా సేవించడంతో మహిళ అస్వస్థతకు గురైంది. ఆమె సమస్యను గుర్తించడానికి డాక్టర్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేసినప్పుడు, ఆమె కుడి కిడ్నీ ద్రవంతో ఉబ్బినట్లు, వందలాది రాళ్లు ఉన్నట్లు గుర్తించారు.


బాధితురాలికి సీటీ స్కాన్‌ నిర్వహించిన వైద్యులు..ఆమె కిడ్నీలో 5 మిల్లీమీటర్ల రాళ్లు, 2 సెంటీమీటర్ల సైజులో ఉన్నట్లు గుర్తించారు. అంతే కాకుండా రక్తపరీక్షలో తెల్లరక్తకణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉన్నట్లు తేలింది. దీనికి గల కారణాలను తెలుసుకునేందుకు వైద్యులు అన్ని పరీక్షలు చేయగా, ఆమె చుక్క నీరు కూడా తాగలేదని తేలింది. నీళ్లకు బదులు బబుల్ టీ, ఫ్రూట్ జ్యూస్, ఆల్కహాలిక్ డ్రింక్స్ తాగడం వల్ల హైడ్రేట్ అవుతుందని డాక్టర్‌కి చెప్పింది. దీంతో ఆమె కిడ్నీలో చాలా రాళ్లు ఏర్పడ్డాయని వైద్యులు నిర్ధారించారు. 2 గంటల శస్త్రచికిత్స తర్వాత, వైద్యులు ఆమె కిడ్నీలో సుమారు 300 రాళ్లను తొలగించారు.

మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి కారణాలు:
తక్కువ నీరు తీసుకోవడం, బరువు తగ్గించే శస్త్రచికిత్స లేదా ఉప్పు లేదా చక్కెర అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల కిడ్నీ స్టోన్ సమస్యలు తలెత్తుతాయి. అలాగే వ్యాయామం చేయని వారి శరీరంలో కిడ్నీ స్టోన్ సమస్య వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. కిడ్నీలో రాళ్లు తగ్గాలంటే ఎక్కువ నీరు తాగాలి. శరీరంలో తగినంత నీరు లేకపోతే, మూత్రపిండాలలో రాళ్లు సులభంగా పేరుకుపోతాయి. శరీరంలో డీహైడ్రేషన్ వల్ల రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. సాధారణంగా స్త్రీల కంటే పురుషుల్లో కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశం మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.