Central Govt : మహిళలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్… వడ్డీ లేకుండా 5 లక్షల రుణాలు….!

Central Govt : ప్రస్తుత కాలంలో మహిళలు కూడా విద్య వైద్య మరియు వివిధ రంగాలలో ఉన్నత స్థానాలలో పాల్గొంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మహిళలు ఆర్థికంగా సాధికారత సాధించడం లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం వారి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని కొత్త పథకాలను అమలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే అర్హత కలిగి ఉన్న మహిళలందరికీ 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా లఖపతి దీదీ యోజన అనే పథకాన్ని ప్రవేశ పెట్టడం జరిగింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

Central Govt : లఖపతి దీదీ యోజన పథకం ..
మహిళలకు ఉచిత శిక్షణ మరియు నైపుణ్యాభివృద్ధి అంశాలను దృష్టిలో పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశ పెట్టడం జరిగింది. ఇక ఈ పథకం ద్వారా మహిళలు సొంతంగా స్వయం ఉపాధి , కొత్త వ్యాపారాలను ప్రారంభించవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ పథకం ద్వారా మహిళలకు వడ్డీ లేకుండా 1 లక్ష నుండి 5 లక్షల వరకు రుణాలను కేంద్ర ప్రభుత్వం అందించనుంది.

Central Govt : ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం…
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లఖపతి దీదీ యోజన పథకం యొక్క ముఖ్య లక్ష్యం గ్రామాలలో నివసించే మహిళలు వారి ప్రాంతంలో చిన్న చిన్న వ్యాపారాలను స్థాపించడానికి ఆర్థిక సాయం కల్పించడం. ఇక ఈ పథకం ద్వారా మహిళలు ప్లంబింగ్ ఎల్ఈడి బల్బులు తయారీ , డ్రోన్ ఆపరేషన్ మరియు టైలరింగ్ వంటి రంగాలలో ఉచితంగా శిక్షణ పొందవచ్చు.

Related News

Central Govt : అవసరమైన పత్రాలు…
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా మహిళలు ప్రయోజనాలు పొందాలంటే కింది పత్రాలను కచ్చితంగా కలిగి ఉండాలి..

ఆధార్ కార్డు

ఆదాయ ధ్రువీకరణ పత్రం

నివాస ధ్రువీకరణ పత్రం

బ్యాంకు ఖాతా వివరాలు

మొబైల్ నెంబర్

పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు.

దరఖాస్తు ప్రక్రియ…

ఈ పథకం ద్వారా అర్హులైన మహిళలు ప్రయోజనాలు పొందాలంటే ముందుగా మీ సమీపంలో గల అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించి ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *