Pinnelli: పిన్నెల్లి సోదరులపై రౌడీషీట్‌?

www.mannamweb.com


పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలపై పోలీసులు రౌడీషీట్‌ తెరిచినట్లు తెలిసింది.

పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలపై పోలీసులు రౌడీషీట్‌ తెరిచినట్లు తెలిసింది. పోలింగ్‌ రోజున రెంటచింతల మండలం పాల్వాయిగేటు గ్రామంలోని కేంద్రంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం పగలగొట్టారు. దీన్ని అడ్డుకున్న తెదేపా కార్యకర్త నంబూరి శేషగిరిరావుపై అనుచరులతో దాడి చేయించారు. పోలింగ్‌ మరుసటి రోజు కారంపూడిలో ఇద్దరు సోదరులూ అనుచరులతో కలిసి దాడులు చేశారు. తెదేపా నాయకులు, కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలకు సంబంధించి పిన్నెల్లి సోదరులపై కేసులు నమోదైన విషయం విదితమే. వీరి మీద రౌడీషీట్‌ తెరవడంపై వివరాలు చెప్పేందుకు పోలీసు అధికారులు సుముఖత వ్యక్తం చేయడం లేదు.