Andhra news: శ్రీలక్ష్మి, ప్రవీణ్‌ ప్రకాశ్‌ జీఏడీకి అటాచ్‌.. భారీగా ఐఏఎస్‌ల బదిలీ

www.mannamweb.com


Andhra news: శ్రీలక్ష్మి, ప్రవీణ్‌ ప్రకాశ్‌ జీఏడీకి అటాచ్‌.. భారీగా ఐఏఎస్‌ల బదిలీ

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, ఎక్సైజ్‌శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌లను జీఏడీకి అటాచ్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

  • జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సాయిప్రసాద్‌
  • పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శిగా శశిభూషణ్‌ కుమార్‌
  • వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రాజశేఖర్‌
  • కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా గోపాలకృష్ణ ద్వివేది
  • పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అనిల్‌కుమార్‌ సింఘాల్‌
  • పౌరసరఫరాలశాఖ కమిషనర్‌గా సిద్ధార్థ్‌ జైన్‌
  • ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా సౌరభ్‌గౌర్‌
  • నైపుణ్యాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శిగా సౌరభ్‌గౌర్‌కు అదనపు బాధ్యతలు
  • పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగా కోన శశిధర్‌
  • ఐటీ, ఆర్టీజీఎస్‌ కార్యదర్శిగా కోన శశిధర్‌కు పూర్తి అదనపు బాధ్యతలు
  • ఉద్యాన, మత్స్యశాఖ సహకార విభాగాల కార్యదర్శిగా బాబు.ఎ
  • ఏపీ సీఆర్‌డీఏ కమిషనర్‌గా కాటమనేని భాస్కర్‌
  • ముఖ్యమంత్రి కార్యదర్శిగా ప్రద్యుమ్న
  • ఆర్థిక వ్యయ విభాగం కార్యదర్శిగా ఎం. జానకి
  • పశు సంవర్థకశాఖ కార్యదర్శిగా ఎం.ఎం.నాయక్‌
  • గనులశాఖ డైరెక్టర్‌, కమిషనర్‌గా ప్రవీణ్‌కుమార్‌
  • ఏపీఎండీసీ ఎండీగా ప్రవీణ్‌కుమార్‌కు అదనపు బాధ్యతలు
  • మురళీధర్‌రెడ్డిని జీఏడీకి రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశం
  • ఆర్థికశాఖ కార్యదర్శిగా వి.వినయ్‌చంద్‌ను నియమిస్తూ సీఎస్‌ నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు.