ఏపీ, తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. విజయవాడ డివిజన్ లో భారీ సంఖ్యలో జాబ్స్!

www.mannamweb.com


ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన నిరుద్యోగులకు రైల్వే శాఖ అదిరిపోయే తీపికబురు అందించింది. విజయవాడ డివిజన్ ఏటీవీఎంలో ఫెసిలిటేటర్ ఉద్యోగాల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది.

విజయవాడ డివిజన్ పరిధిలోని మొత్తం 26 రైల్వే స్టేషన్లలో 59 ఉద్యోగాలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలు కేవలం బోనస్ ఆధారితంగా కమిషన్ ద్వారా డబ్బులను సంపాదించే ఉద్యోగాలు కావడం గమనార్హం.

https://scr.indianrailways.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన అర్హతలు, ఇతర వివరాలను తెలుసుకోవచ్చు. పదో తరగతి అర్హతతో ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉండగా జులై 15వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉండనుంది. ఆఫ్ లైన్ విధానం ద్వారాఈ ఉద్యోగ ఖాళీల కోసం సులువుగా దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంది.

18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు వయో పరిమితిలో సడలింపులు ఉండనున్నాయి. మొత్తం26 రైల్వే స్టేషన్లలో 59 పోస్టులను భర్తీ చేయనుండగా విజయవాడ స్టేషన్ లో 9 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైతే ఎంపికైన వాళ్లకు 3 శాతం కమిషన్ లభించనుందని సమాచారం అందుతోంది.

అన్ రిజర్వ్ డ్ కేటగిరీలో టికెట్లను మిషన్ల ద్వారా జారీ చేయడం కోసం ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకునే అవకాశం అయితే ఉంటుందని సమాచారం అందుతోంది.