AP Govt: ఏపీలో నేటి నుంచి ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ ప్రారంభం

www.mannamweb.com


సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ వెబ్‌ పోర్టల్‌ను సోమవారం ఉదయం 9 గంటలనుంచి ప్రారంభిస్తోంది.

జమ్మలమడుగు గ్రామీణ, న్యూస్‌టుడే: సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ వెబ్‌ పోర్టల్‌ను సోమవారం ఉదయం 9 గంటలనుంచి ప్రారంభిస్తోంది.

జిల్లాకేంద్రాల్లోని కలెక్టరేట్లలో, మున్సిపల్‌ కార్యాలయాల్లో, మండల కేంద్రాల్లోని తహసీల్దార్‌ కార్యాలయాల్లో సంబంధిత అధికారులు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. అర్జీలను ఇచ్చేందుకు తప్పనిసరిగా ఆధార్, ఫోన్‌ నంబరు ఇవ్వాలి. దరఖాస్తును ఆన్‌లైన్‌లో నమోదు చేసి సంఖ్య కేటాయిస్తారు. దాని ఆధారంగా సమస్య పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకునే వీలుంటుంది.