పసుపు రంగు దంతాలతో ఇబ్బందిపడుతున్నారా..? ఇలా చేస్తే మీ చిరునవ్వులో మెరుపు ఖాయం

www.mannamweb.com


తెల్లటి ముత్యాల్లాంటి దంతాలు ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ, కొందరికీ పళ్లు పసుపు పచ్చగా మారుతుంటాయి. ఇలాంటి పళ్ల కారణంగా వారు నలుగురిలో నవ్వడానికి కూడా వెనుకాడతారు.

మనం తినే ఆహారాలు, తాగే పానీయాలు, వయస్సు కారణంగా దంతాల సమస్యలకు కారణమవుతాయంటున్నారు నిపుణులు. అయితే, పళ్లపై పేరుకుపోయిన పసుపు రంగును తొలగించడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా కూడా ఎలాంటి లాభం ఉండదు. కానీ, ఇంట్లో లభించే కొన్ని పదార్థాలు ఉపయోగించడం వల్ల మీ దంతాలు తెల్లగా ముత్యాల్ల మెరుస్తాయి. అంతేకాదు.. చిగుళ్లు ఆరోగ్యంగా కూడా ఉంటాయి. అలాంటి పదార్థాలేవో ఇక్కడ తెలుసుకుందాం..

ఉప్పు..

ఉప్పును ఉపయోగించి పళ్లపై పేరుకుపోయిన మరకలను తొలగించుకోవచ్చు.ఇందుకోసం కొద్దిగా ఉప్పు వేలితో తీసుకుని దంతాలను తోముకోవడం వల్ల పసుపు రంగు తొలగిపోయి తెల్లని రంగు వస్తుంది. సుమారు 1-2 నిమిషాలు ఉప్పుతో మీ దంతాలను బ్రష్ చేయండి. అంతేగానీ, పళ్లను గట్టిగా రుద్దకుండా జాగ్రత్తగా తోముకోవాలి.. ఎందుకంటే ఎక్కువ గట్టిగా బ్రష్ చేయడం వల్ల పంటి ఎనామిల్, చిగుళ్లు దెబ్బతింటాయి. బ్రష్ చేసిన తర్వాత మీ నోటిని నీటితో బాగా కడగాలి. ఇలా రోజూ చేయడం వల్ల దంతాలకు రంగు వస్తుంది.

కొబ్బరి నూనె పుల్లింగ్ కూడా నోటిని శుభ్రపరుస్తుంది. చిగుళ్ళ ఆరోగ్యానికి మంచిది. పుసుపు దంతాలు తెల్లగా మారుతాయి. మీ నోటిలో నూనె పోసుకున్న తర్వాత, 10-20 నిమిషాల పాటు పుక్కిల్లించాలి.. ఇది నోటిలోని అన్ని భాగాలకు చేరేలా చూసుకోవాలి. ఇందుకోసం మంచి స్వచ్ఛమైన కొబ్బరి నూనెను మాత్రమే ఉపయోగించాలి.

యాపిల్ సైడర్ వెనిగర్ కూడా చిగుళ్ల పరిశుభ్రత, పసుపు దంతాలను తొలగించి తెల్లబడటంలో సహాయపడటానికి సహజ మౌత్ వాష్‌గా ఉపయోగించవచ్చు. రోజుకు రెండుసార్లు ఆపిల్ సైడర్ వెనిగర్ నీటితో మీ నోటిని శుభ్రం చేసుకోండి. ఇది నోటిలో బ్యాక్టీరియా పెరుగకుండా కాపాడుతుంది.

దంతాలను తెల్లగా మార్చడంలో సహాయపడేందుకు బేకింగ్ పౌడర్, నిమ్మరసం కూడా ఉపయోగపడుతుంది. ఈ రెండింటినీ కొద్దిగా తీసుకుని దంతాల మీద బాగా రుద్ది 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత కడగాలి. ఇది దంతాల రంగును తెల్లగా మార్చేయడానికి సహాయపడుతుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.