పంద్రాగస్టు వేడుకలపై కీలక నిర్ణయం.. గ్రామ పంచాయతీలకు భారీగా నిధుల పెంపు, విద్యార్థులకు ప్రత్యేక పోటీలు

www.mannamweb.com


ఏపీలో పంద్రాగస్టు వేడుకల నిర్వహణకు గ్రామ పంచాయతీలకు భారీగా నిధులను పెంచారు. మైనర్ పంచాయతీలకు ఇచ్చే రూ.100ను రూ. 10వేలకు, మేజర్ పంచాయతీలకు ఇచ్చే రూ.250ను రూ. రూ.25 వేలు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ వివరాలను వెల్లడించారు.

ప్రతీ గ్రామంలో పంద్రాగస్టు దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ఆదేశించారు. ఆరోజు నిర్వహించే కార్యక్రమాల నిర్వహణకు పంచాయతీలకు నిధుల కొరత లేకుండా తమ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుందని తెలిపారు.

భారీగా నిధులు పెంపు….

పంచాయతీల్లో ఆగస్టు 15న వేడుకల నిర్వహణకు ఇచ్చే మొత్తాన్ని గణనీయంగా పెంచుతున్నామన్నారు. ఇప్పటి వరకూ మైనర్ పంచాయతీలకు రూ.100, మేజర్ పంచాయతీలకు రూ.250 ఇచ్చేవారు. ఇప్పుడు ఆ మొత్తాలను రూ.10 వేలు, రూ.25 వేలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఉపముఖ్యమంత్రి పవన్ వెల్లడించారు.

2011 జనాభా ఆధారంగా 5 వేలులోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.10 వేలు, 5వేలు పైబడి జనాభా ఉన్న పంచాయతీలకు రూ.25 వేలు అందిస్తామని పవన్ వెల్లడించారు. ఈ మొత్తంతో స్వాతంత్య్ర దినోత్సవం రోజున కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలకు ఇదే విధంగా రూ.10 వేలు, రూ.25 వేలు చొప్పున నిధులు అందిస్తామన్నారు.

పవన్ కళ్యాణ్ ను ఇటీవల పలువురు సర్పంచులు కలిశారు. ఈ సందర్భంలో పంద్రాగస్టుతో పాటు రిపబ్లిక్ డే నిర్వహణ కూడా కష్టంగా ఉందని వాపోయారు. జెండా పండుగను ఘనంగా చేసేందుకు కూడా తగినన్ని నిధులు ఉండటం లేదని తెలిపారు. ఇందుకు సంబంధించి పంచాయతీలకు ఎంత మొత్తాలు ఇస్తున్నదీ తెలియచేయాలని పవన్ కళ్యాణ్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

గత 34 ఏళ్లుగా రూ.వంద, రూ.250 చొప్పునే అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆ స్వల్ప మొత్తాలతో కార్యక్రమాల నిర్వహణ సాధ్యం కాదనీ, ఈ వేడుకలను పంచాయతీ సర్పంచులు, సిబ్బంది ఘనంగా చేపట్టాలంటే తగిన మొత్తం ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఆ మేరకు రూ.10 వేలు, రూ.25 వేలు నిర్ణయించారు.

భారీగా నిధులు పెంపు….

పంచాయతీల్లో ఆగస్టు 15న వేడుకల నిర్వహణకు ఇచ్చే మొత్తాన్ని గణనీయంగా పెంచుతున్నామన్నారు. ఇప్పటి వరకూ మైనర్ పంచాయతీలకు రూ.100, మేజర్ పంచాయతీలకు రూ.250 ఇచ్చేవారు. ఇప్పుడు ఆ మొత్తాలను రూ.10 వేలు, రూ.25 వేలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఉపముఖ్యమంత్రి పవన్ వెల్లడించారు.

2011 జనాభా ఆధారంగా 5 వేలులోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.10 వేలు, 5వేలు పైబడి జనాభా ఉన్న పంచాయతీలకు రూ.25 వేలు అందిస్తామని పవన్ వెల్లడించారు. ఈ మొత్తంతో స్వాతంత్య్ర దినోత్సవం రోజున కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలకు ఇదే విధంగా రూ.10 వేలు, రూ.25 వేలు చొప్పున నిధులు అందిస్తామన్నారు.

పవన్ కళ్యాణ్ ను ఇటీవల పలువురు సర్పంచులు కలిశారు. ఈ సందర్భంలో పంద్రాగస్టుతో పాటు రిపబ్లిక్ డే నిర్వహణ కూడా కష్టంగా ఉందని వాపోయారు. జెండా పండుగను ఘనంగా చేసేందుకు కూడా తగినన్ని నిధులు ఉండటం లేదని తెలిపారు. ఇందుకు సంబంధించి పంచాయతీలకు ఎంత మొత్తాలు ఇస్తున్నదీ తెలియచేయాలని పవన్ కళ్యాణ్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

గత 34 ఏళ్లుగా రూ.వంద, రూ.250 చొప్పునే అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆ స్వల్ప మొత్తాలతో కార్యక్రమాల నిర్వహణ సాధ్యం కాదనీ, ఈ వేడుకలను పంచాయతీ సర్పంచులు, సిబ్బంది ఘనంగా చేపట్టాలంటే తగిన మొత్తం ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఆ మేరకు రూ.10 వేలు, రూ.25 వేలు నిర్ణయించారు.