మందార పువ్వుల టీ.. డైలీ తీసుకుంటే జరిగే మ్యాజిక్ ఇదే

www.mannamweb.com


మందార పూలతో తయారు చేసిన టీ రోజూ తీసుకోవటం వల్ల గుండె సమస్యలు దూరం చేసుకోవచ్చు.. అలాగే అల్జీమర్స్, ఆర్థరైటిస్ సమస్యలతో బాధపడేవారికి కూడా ఈ టీతో ఉపశమనం లభిస్తుంది అంటున్నారు ఆయుర్వేద నిపుణులు.

రక్తపోటును తగ్గించడంలో ఈ టీ చాలా మేలు చేస్తుంది. అలాగే ఈ టీ కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ఇందుకోసం ఎండిపోయిన మందారపూల రెమ్మలను రెండు, మూడు స్పూన్లు తీసుకోవాలి. వీటిని రెండు కప్పుల నీటిలో వేసి ఐదు నిమిషాలపాటు మరిగించాలి. అంతే మందారపూల టీ తయారైనట్లే. వీటిని వడబోసి.. కాస్త తేనె, నిమ్మకాయ రసం కలుపుకుని తాగేయాలి.

ఇలా తయారు చేసుకున్న మందారపూల టీని ప్రతిరోజూ ఉదయం తాగడం వల్ల సులభంగా బరువు తగ్గవచ్చు. శరీరంలోని కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి. మనం తీసుకునే కార్బో హైడ్రేట్స్ ని కూడా ఫ్యాట్స్ గా మారకుండా అడ్డుకుంటుంది. దీంతో క్రమంగా బరువు తగ్గించడంలో తొడ్పడుతుంది.

హై బీపీ ఉన్నవారు కూడా రెగ్యులర్ గా ఈ మందార టీ తాగాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.. ఇలా తాగడం వల్ల బీపీ చాలా వరకు కంట్రోల్ లో ఉంటుంది. రెగ్యులర్ గా తాగడం వల్ల హై బీపీ కి ఇక మీరు మందులు వాడాల్సిన అవసరం కూడా ఉండదని చెబుతున్నారు.

మందార పువ్వు టీ కాలేయ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఈ టీ శరీరంలోని వివిధ రకాల టాక్సిన్స్‌ను తొలగిస్తుంది. మందారపూల టీలో యాంటీడిప్రసెంట్ ప్రాపర్టీలు పుష్కలంగా ఉంటాయి. ఇవి.. మన బాడీలో యాంక్సైటీ, డిప్రెషనల్ లాంటివి తగ్గించడంలో సహాయం చేస్తాయి. ఇది చర్మం, జుట్టు సంరక్షణలో కూడా గొప్పగా పనిచేస్తుంది.