అందులో అనుమానమే లేదు.. వాళ్లను వదిలేది లేదు: మంత్రి నారా లోకేష్

www.mannamweb.com


చట్టాలను ఉల్లంఘించిన వారిపై తప్పకుండా చర్యలు ఉంటాయన్నారు మంత్రి నారా లోకేష్‌. మాజీ మంత్రి జోగి రమేష్ కొడుకు ఫేక్ సర్టిపికెట్లతో అగ్రిగోల్డ్ భూములను కొట్టేశాడని ఆరోపించారు.. రేపు లిక్కర్, ఇసుక దందాల మీదా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.. ఇది తాను ఊరూరా చెప్పా.. ప్రజల భూములు కొట్టేస్తే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా? అని ప్రశ్నించారు. ప్రజలు స్పష్టంగా తీర్పు ఇచ్చారని.. తమకు అధికారం ఇచ్చారన్నారు. రెడ్‌బుక్‌ తమకు మ్యాండేటరీ అన్నారు.. గత ప్రభుత్వంలో చట్టాలని ఉల్లంఘించి, టీడీపీ కార్యకర్తలను, ప్రజలను ఇబ్బంది పెట్టారన్నారు.. వాళ్లని మాత్రం వదిలిపెట్టను అన్నారు. భవిష్యత్‌లో ఇసుక పాలసీపై కూడా యాక్షన్ తీసుకుంటాం అన్నారు.. లిక్కర్ స్కాంపై కూడా చర్యలు తీసుకుంటాం.. అన్నారు. అడ్డగోలుగా ప్రజలు భూములు దోచేస్తూ ఉంటే, మేమేం పట్టించుకోకూడదా..? అని ప్రశ్నించారు. తాను పాదయాత్ర చేసే సమయంలో రెడ్ బుక్ పట్టుకుని, ప్రతి ఊర్లో తిరిగి మాట్లాడాను.. చట్టాలను ఉల్లంఘించినవారిపై చర్యలు తీసుకుంటానన్నారు. అంబేద్కర్ పేరు కంటే జగన్ పేరు పెద్దదిగా ఉంది.. బాధపడిన దళిత యువకులు జగన్ పేరును పీకేశారన్నారు.