వయసు పెరిగినా అందం తరగకూడదంటే.. ఈ పండ్లు తినాలి! చర్మ కాంతి రెట్టింపు చేసే ఫలాలివే

www.mannamweb.com


ముఖం చూసి మీ వయసెంతో ఈజీగా చెప్పొచ్చు. వయసు పెరిగే కొద్దీ ముఖంలో ఏర్పడే ముడతల ఆధారంగా వయసు చెప్పడానికి వీలుంటుంది. అయితే పెరిగే వయస్సును దాచడం చాలా కష్టం. మధ్యవయస్సులో కూడా నిత్య యవ్వనంగా ఉండాలంటే చర్మాన్ని బిగుతుగా ఉంచుకోవాలి. కాబట్టి రెగ్యులర్‌గా పార్లర్ కి వెళ్లి ఫేషియల్ చేయించుకుంటూ ఉండాలి. కానీ దీని వల్ల డబ్బు వృద్ధా అవుతుంది. అలాకాకుండా సింపుల్‌గా చర్మ వృద్ధాప్యాన్ని కప్పిపుచ్చడానికి మరో మార్గం కూడా ఉంది. అదే ఆహారంపై దృష్టి పెట్టడం. అవును.. పౌష్టికాహారం తీసుకోకపోవడం వల్ల చర్మ అకాల వృద్ధాప్యానికి గురవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సాధారణంగా మీ రోజువారీ ఆహారంలో తృణధాన్యాలు, కూరగాయలు, పండ్లు తీసుకుంటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. శరీరంలో పోషకాల లోపం తలెత్తితే అకాల వృద్ధాప్యం దాపురిస్తుంది. చర్మం వృద్ధాప్యాన్ని నివారించడానికి కొన్ని రకాల పండ్లు తినాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటివల్ల వయసు పెరిగినా చర్మ తేజస్సు మారదు.

పండిన బొప్పాయి చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ పండులో విటమిన్లు A, C, E వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. పండిన బొప్పాయి తింటే పొట్ట కూడా శుభ్రం అవుతుంది. తినడమే కాకుండా పండిన బొప్పాయిని ముఖానికి రుద్దుకోవాలి.

ముసాంబి, నారింజ, నిమ్మ వంటి సిట్రస్‌ పండ్లు చర్మానికి మేలు చేస్తాయి. సిట్రస్ పండ్లలో విటమిన్ సి ఉంటుంది. ఇది చర్మంలో యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఈ రకమైన పండ్లు చర్మ స్థితిస్థాపకతను పెంచుతాయి.

దానిమ్మ రక్తాన్ని శుద్ధి చేయడానికి, చర్మ సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. దానిమ్మ తినడం వల్ల చర్మ కాంతి మెరుగుపడుతుంది. UV కిరణాల వల్ల కలిగే చర్మ నష్టాన్ని సులభంగా నివారిస్తుంది.