ఏపీలో 16 మంది ఐపీఎస్ లు బదిలీ, సీఐడీ ఐజీగా వినీత్ బ్రిజ్ లాల్

www.mannamweb.com


ఏపీలో 16 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. సీఐడీ ఐజీగా వినీత్ బ్రిజ్ లాల్ ను ఏపీ సర్కార్ నియమించింది.

ఏపీ ప్రభుత్వం 16 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సీఐడీ ఐజీగా వినీత్ బ్రిజ్ లాల్ నియమించింది. పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్టు చేయాలని బాపూజీ అట్టాడ, కేవీ శ్రీనివాసరావును సీఎస్ ఆదేశించారు.

ఐపీఎస్ బదిలీలు

పీ అండ్‌ ఎల్‌ ఐజీ – ఎం.రవిప్రకాశ్‌
ఇంటెలిజెన్స్‌ ఐజీ- పీహెచ్డీ రామకృష్ణ
ఇంటెలిజెన్స్‌ ఎస్పీ-కె. ఫకీరప్ప
డీజీపీ కార్యాలయం డీఐజీ అడ్మిన్‌- ఆర్.ఎన్.అమ్మిరెడ్డి
రోడ్‌ సేఫ్టీ అథారిటీ డీఐజీ – సీ.హెచ్‌ విజయరావు
శాంతిభద్రతల ఏఐజీ -సిద్ధార్థ్‌ కౌశల్‌
విశాఖ శాంతిభద్రతల డీసీపీ – మేరీ ప్రశాంతి
అనకాపల్లి ఎస్పీ – తుహిన్‌ సిన్హా
పీటీవో ఎస్పీ – కేఎస్‌ఎస్‌వీ సుబ్బారెడ్డి
ఎన్టీఆర్‌ కమిషనరేట్‌లో క్రైమ్‌ డీసీపీ -తిరుమలేశ్వర్‌రెడ్డి
ఏపీఎస్పీ-3 బెటాలియన్‌ కమాండెంట్‌ – దీపిక
ఒంగోలు పోలీస్‌ ట్రైనింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ – జి.రాధిక
ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ ఎస్పీ – ఆరిఫ్ హఫీజ్‌
అనకాపల్లి ఎస్పీ -టి.సిన్హా
రాజమండ్రి ఆర్వీ ఈవో ఎస్పీ – కేఎస్ఎస్వీ సుబ్బారావు