జలుబు, దగ్గు చిటికెలో మాయం చేయాలంటే.. వాటిని ఆహారంలో తీసుకోండి

www.mannamweb.com


వరుస వర్షాల కారణంగా మనలో అధిక మంది జలుబు, దగ్గు బారిన పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనల్ని మనం రక్షించుకోవడానికి నల్ల మిరియాల ఔషధంగా బలేగా పనిచేస్తుంది.

నల్ల మిరియాల్లో యాంటీమైక్రోబయల్, యాంటీ అలెర్జిక్, యాంటీ బాక్టీరియల్, యాంటీ గ్యాస్, డైయూరిటిక్, డైజెస్టివ్ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇవి బరువు తగ్గడంలో కూడా సహాయపడతాయి, జీర్ణవ్యవస్థను, రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.

వర్షా కాలంలో మిరియాల కషాయం తాగితే జలుబు, దగ్గు సమస్యల నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది. అంతే కాకుండా మిరియాలు తినడం వల్ల గొంతు నొప్పి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

బరువు తగ్గడానికి చాలా మంది రకరకాల ఇబ్బందులు పడుతుంటారు. మీరు కూడా ఊబకాయంతో సతమతమవుతున్నట్లయితే, దాన్ని తగ్గించుకోవడానికి మిరియాలు ఆహారంలో చేర్చుకోవచ్చు.

వర్షాకాలంలో కండరాలు, కీళ్ల నొప్పులతో బాధపడుతుంటే మీ ఆహారంలో మిరియాలు తప్పక చేర్చుకోవాలి. మిరియాలు కీళ్ల నొప్పులు, వాపుల నుండి ఉపశమనాన్ని అందిస్తాయి. మిరియాల్లోని యాంటీ-అలెర్జిక్, ఆర్థరైటిక్ గుణాలు నొప్పి, మంటను తగ్గిస్తాయి