ఐదు పాత్రల్లో శ్రీ విష్ణు నట విశ్వరూపం.. స్వాగ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్‌! స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

www.mannamweb.com


సామజవరగమన, ఓం భీం బుష్ లతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు హీరో శ్రీ విష్ణు. వీటి తర్వాత అతను నటించిన మరో డిఫరెంట్ మూవీ స్వాగ్. గతంలో శ్రీ విష్ణుతో రాజ రాజా చోర వంటి సూపర్ హిట్ ను తెరకెక్కించిన హసిత్ గోలినే ఈ కు కూడా దర్శకత్వం వహించాడు.

రీతూ వర్మ, మీరా జాస్మిన్, దక్ష నగార్కర్, శరణ్య హీరోయిన్లుగా నటించారు. శ్రీ విష్ణు గెటప్స్, పోస్టర్లు, టీజర్స్, ట్రైలర్ తో రిలీజ్ కు ముందే ఈ పై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. జెండర్ ఈక్వాలిటీ అనే సున్నితమైన అంశానిక కామెడీని జోడించి ఆసక్తికరంగా స్వాగ్ ను రూపొందించారు. అంచనాలకు తగ్గట్టే అక్టోబర్ 4 న థియేటర్లలో రిలీజైన స్వాగ్ పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. అంతకు ముందు ఎన్టీఆర్ దేవర థియేటర్లలో ఉన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. అయితే లో పాత్రలు మరీ ఎక్కువగా ఉండడంతో కొంతమంది కన్ఫ్యూజన్ కు గురయ్యారని నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి. కానీ ఐదు పాత్రల్లో శ్రీ విష్ణు నట విశ్వరూపానికి సినీ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మొత్తానికి థియేటర్లలో బాగానే ఆడిన స్వాగ్ ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల తర్వాతే ఈ ను ఓటీటీలోకి తీసుకొచ్చేలా డీల్ జరిగిందని టాక్. ఈ లెక్కల ప్రకారం నవంబర్ మొదటి వారంలో స్వాగ్ ఓటీటీ లోకి వచ్చే అవకాశముంది. సోషల్ మీడియాలో వస్తోన్న న్యూస్ ను బట్టి నవంబర్ 4న స్వాగ్ డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుందని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టి.జి.విశ్వప్రసాద్ స్వాగ్ ను నిర్మించారు. సునీల్, రవి బాబు, గోపరాజు రమణ, గెటప్ శీను, రాజ్య లక్ష్మి, పృథ్వీ రాజ్ తదితరులు ఈ లో కీలక పాత్రలు పోషించారు. వివేక్ సాగర్ బాణీలు సమకూర్చారు. ఎడిటర్ గా విప్లవ్ నైషధం వ్యవహరించారు. అలాగే టోగ్రఫీ బాధ్యతలను వేదరామన్ శంకరన్ నిర్వర్తించారు. సమాజంలో ఆడ,మగ అనే భేదాలు లేకుండా అందరూ సమానమే అనే భావనతో ఎంతో ఎంటర్ టైనింగ్ గా స్వాగ్ మూవీని తీర్చిదిద్దారు. మరి థియేటర్లలో ఈ ను మిస్ అయ్యారా? అయితే కొద్ది రోజులు వెయిట్ చేయండి. ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేద్దురు గానీ..