ఇప్పుడు 5 రోజుల్లోనే రూ.570 కోట్ల లిక్కర్ సేల్స్.. అప్పుడేమో టెండర్లతో బోలెడు ఆదాయం

www.mannamweb.com


గతంలో ప్రభుత్వ మద్యం షాపుల్లో కొన్ని బ్రాండ్లు మాత్రమే దొరికేవి. పైగా రేట్లు కూడా ఎక్కువే. దీంతో మద్యం ప్రియులు వైన్‌ షాపుల కంటే బార్లకే వెళ్లేవారు.

ఇప్పుడు 5 రోజుల్లోనే రూ.570 కోట్ల లిక్కర్ సేల్స్.. అప్పుడేమో టెండర్లతో బోలెడు ఆదాయం

కొత్త సీసా..కొత్త మందు..తగ్గిన రేటు. ఇక కిక్కే కిక్కు. ఏపీలో కొత్త మద్యం పాలసీ మందు బాబులకే కాదు..లిక్కర్ వ్యాపారులకు, ప్రభుత్వానికి కూడా మంచిరోజులు తీసుకొచ్చింది. గత ఐదేళ్లలో టేస్ట్‌ లేని మందు..నోటితో పలకలేని బ్రాండ్లు చూసి చిర్రెత్తిపోయిన మందుబాబులు..ఇప్పుడు లో కాస్ట్‌కే ప్రీమియం లిక్కర్‌ను తాగి ఎంజాయ్ చేస్తున్నారు. టెండర్లలో షాపులు దక్కించుకున్న వ్యాపారులకు కూడా మంచిగానే బిజినెస్ అవుతోంది. ఇక ప్రభుత్వానికి టెండర్ ఫీజ్‌ నుంచి సేల్స్‌ వరకు ఖజానాలో కాసులు వచ్చి పడుతూనే ఉన్నాయి.

కొత్త లిక్కర్ షాపులు తెరుచుకుని వారం రోజులే అయింది. ఇప్పటికే రికార్డు స్థాయి సేల్స్ జరుగుతున్నాయి. ఏకంగా ఆరు వందల కోట్ల లిక్కర్ అమ్మకాలు జరిగినట్లు అంచనా. ఇలా తెరుచకున్నాయో లేదో.. కొత్త మద్యం షాపులు సందడిగా మారాయి. పాత బ్రాండ్ల రావడంతో పాటు..రూ.99కే క్వార్టర్‌ మందు దొరుకుతుండటంతో ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు మందుబాబులు.

అయితే కొన్ని షాపుల్లో ఇప్పటికీ కూడా రూ.99కే క్వార్టర్ మద్యం అందుబాటులో లేదు. రూ.145కు క్వార్టర్ మద్యం అంటూ షాపుల నిర్వహకులు అమ్మకాలు చేస్తున్నారు. ఈ విషయంలో కొంత అసంతృప్తి వ్యక్తమవుతున్నా వైన్‌ షాపుల దగ్గర రద్దీ మాత్రం తగ్గడం లేదు.

కొత్త మద్యం పాలసీ స్టార్టింగ్‌లోనే రికార్డు స్థాయి ఆదాయం
ఏపీ ఆబ్కారీ శాఖకు కాసుల మత్తు కిక్కెస్తోంది. కొత్త మద్యం పాలసీ స్టార్టింగ్‌లోనే రికార్డు స్థాయి ఆదాయం రాబడుతోంది ఆబ్కారీ శాఖ. మద్యం అమ్మకాల్లో సరికొత్త రికార్డు సృష్టిస్తోంది. కొత్త లిక్కర్ షాపులు మొదలైన వారం రోజుల్లోనే రూ.6వందల కోట్లకు పైగా విలువ చేసే సరుకు గౌడన్ల నుంచి బయటకు వెళ్లింది.

రాష్ట్రంలోని మద్యం డిపోల నుంచి 6లక్షల 77వేల 511 కేసుల మద్యం, లక్షా 94వేల 261 బీర్ల కేసులు అమ్మారు. బార్ల కంటే మందు బాబులు మద్యం షాపుల వైపే వెళ్తున్నారు. ఆబ్కారీ శాఖ ప్రకటించినట్లు రూ.99లకే క్వార్టర్ పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోయినా..ఇంకా కొన్ని షాపులు ప్రారంభించనప్పటికీ..అమ్మకాలు మాత్రం భారీగానే జరుగుతున్నాయి.

అప్పట్లో మద్యం షాపుల కంటే బార్లకే ఎక్కువ ఆదాయం
గతంలో ప్రభుత్వ మద్యం షాపుల్లో కొన్ని బ్రాండ్లు మాత్రమే దొరికేవి. పైగా రేట్లు కూడా ఎక్కువే. దీంతో మద్యం ప్రియులు వైన్‌ షాపుల కంటే బార్లకే వెళ్లేవారు. వివిధ పన్నుల పేరుతో బార్లలో క్వార్టర్ బాటిల్‌కు రూ.80 వరకు వసూలు చేసేవారు బార్ల నిర్వహకులు. గత ప్రభుత్వంలో మద్యం షాపుల కంటే బార్లకే ఎక్కువ ఆదాయం వచ్చిందని చెప్పొచ్చు.

కొత్త మద్యం పాలసీలో పాత బ్రాండ్లు వచ్చేశాయ్. ప్రీమియం బ్రాండ్లు కొన్ని అందుబాటులో ఉన్నాయ్. పైగా రేట్లు కూడా తక్కువే. దీంతో బార్ల కంటే వైన్‌షాపులకే వెళ్తున్నారు పబ్లిక్. ఇలాగే కొద్ది రోజులు కొనసాగితే మందుబాబులు షాపులకు అలవాటు పడతారనే టెన్షన్ బార్ల నిర్వహకుల్లో కనిపిస్తోంది. దీంతో క్వార్టర్‌ బాటిల్‌పై రూ.30 వరకు తగ్గిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నారు.

కొత్త మద్యం పాలసీతో ప్రభుత్వానికి అయితే ఆదాయం భారీగా పెరిగింది. టెండర్ ఫీజు రూపంలోనే ప్రభుత్వానికి దాదాపు రూ.18 వందల కోట్ల ఆదాయం వచ్చింది. ఇప్పుడు రికార్డు స్థాయి లిక్కర్‌ సేల్స్‌తోనూ ఆబ్కారీ శాఖ ఇన్‌కమ్‌ పెరిగిపోయింది. ఇలా కొత్త లిక్కర్‌ స్కీమ్‌ ఇటు జనాలకు..అటు వ్యాపారులకు..ప్రభుత్వానికి అందరికీ ఉపయోగకరంగా మారింది.