190 కొత్త ‘108’ వాహనాల కొనుగోలుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం

వైద్య ఆరోగ్యశాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక ప్రతిపాదనలకు సీఎం ఆమోదం తెలిపారు. ఇకపై 108, 104 సేవలకు సింగిల్ సర్వీస్ ప్రొవైడర్ ఉండనున్నారు.


190 కొత్త 108 వాహనాల కొనుగోలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 108 అంబులెన్స్ సిబ్బంది, డ్రైవర్లకు అదనంగా ఇకపై 4వేలు ఇవ్వనున్నారు. అందుబాటులోకి కొత్తగా 58 మహాప్రస్థానం వాహనాలు రానున్నాయి. ప్రతి మండలంలో జన ఔషధి స్టోర్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రివెంటివ్ హెల్త్ కేర్‌కు ప్రాధాన్యం ఇచ్చేలా వైద్య శాఖ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సీఎం సూచించారు. వైద్య శాఖలో పెండింగ్‌లో ఉన్న సమస్యలు, తీసుకురానున్న సంస్కరణలపై చర్చించారు. మంత్రి సత్య కుమార్‌తో పాటు, వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.