ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే లక్ష్యమని డిజిటల్ విద్యా బోధనలకు గత జగన్ సర్కార్ నాంది పలికింది. ఇందులో భాగంగా విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు బైజూస్ కంటెంట్ పేరిట ట్యాబ్లను పంపిణీ చేసింది. అవి నేడు ఒక్కొక్కటిగా మూలకు చేరుతున్నాయి. చాలా చోట్ల ట్యాబ్లు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. తద్వారా బోధనా సమయాల్లో స్టూడెంట్స్ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
ఏలూరు జిల్లాలో 2022-2023, 2023-2024 విద్యా సంవత్సరాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మొత్తం 34,995 ట్యాబ్లు పంపిణీ చేశారు. అరకొర పాఠ్యాంశాల్ని ఆర్భాటంగా అప్లోడ్ చేశారు. ప్రస్తుతం వాటిలో దాదాపు 25 శాతం మరమ్మతులకు గురయ్యాయని అధికారులు చెబుతున్నారు. బైజూస్తో ఒప్పందం చేసుకున్నప్పటికీ అన్ని సబ్జెక్టులను ట్యాబ్లలో అప్లోడ్ చేయలేదు.
Byjus Content Tabs Damaged : చేసిన సబ్జెక్టుల్లో కొన్ని పాఠ్యాంశాలు పొందుపరచకపోవడం, నమోదు చేసిన పాఠ్యాంశం పూర్తి స్థాయిలో నిక్షిప్తం చేయకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల్లో అరకొర బోధనే సాగిందని చెప్పొచ్చు. దీంతో పాఠ్యాంశాలను విపులంగా వివరించకపోవడంతో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. మరోవైపు లాకింగ్ వ్యవస్థలో లోపాల కారణంగా విద్యార్థులు ట్యాబుల్లో వినోదయాప్లు ఇన్స్టాల్ చేసుకుని చూస్తున్నారు.
ఈ ట్యాబ్ల్లో యూట్యూబ్, రీల్స్ చూస్తూ సమయాన్ని వృథా చేసుకుంటున్నారని గతంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. నాడు మొదటగా వీటిని పొందిన విద్యార్థులే ఈ నెల 17 నుంచి పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. దీనిపై సమగ్ర శిక్షా ఏపీసీ పంకజ్కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాలు రావాల్సి ఉందని చెప్పారు.