సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. మంగళవారం రోజున సీబీఎస్ఈ బోర్డు వీటిని విడుదల చేసింది.
విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో ఫలితాలను చూసుకోవచ్చు. విద్యార్థులు ఫలితాల గురించి తెలుసుకోవడానికి cbseresults.nic.in, results.cbse.nic.in, cbse.gov.in వంటి అధికారిక వెబ్సైట్లను సందర్శించాలి. విద్యార్థులు వారి స్కోర్లను యాక్సెస్ చేయడానికి… అడ్మిట్ కార్డ్లో పేర్కొన్న విధంగా వారి రోల్ నంబర్, పాఠశాల నెంబర్, పుట్టిన తేదీ వంటి వివరాలు ఎంటర్ చేయాలి.సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలులో 93.60 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. గత సంవత్సరం నుంచి ఉత్తీర్ణత శాతం 0.06 శాతం పెరిగింది. బాలుర కంటే బాలికలు 2.37 శాతం ఎక్కువ ఉత్తీర్ణత సాధించారు. బాలికల ఉత్తీర్ణత 95 శాతంగా నమోదైంది. సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలను ఎలా చెక్ చేయాలంటే… అధికారిక వెబ్సైట్ cbseresults.nic.inను సందర్శించాలి.హోమ్పేజీలో 10వ తరగతి ఫలితాల లింక్పై క్లిక్ చేయండి.రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వంటి వివరాలను ఉపయోగించి లాగిన్ అవ్వండిఅప్పుడు రిజల్ట్ స్క్రీన్పై ప్రదర్శించబడుతుంది.విద్యార్థులు భవిష్యత్తు అవసరాల కోసం CBSE 10వ తరగతి రిజల్ట్స్కు సంబంధించిన పీడీఎఫ్ను డౌన్లోడ్ చేసి సేవ్ చేయండి.ఇక, ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 4 మధ్య సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షలను సీబీఎస్ఈ నిర్వహించిన విషయం తెలిసిందే. కొద్దిసేపటి క్రితం సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. అందులో 88.39 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ ఫలితాల్లో బాలుర కంటే బాలికలే ఎక్కువ శాతం ఉత్తీర్ణత సాధించినట్లు సీబీఎస్ఈ తెలిపింది.
































