సెప్టెంబర్ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి దర్శనం, గదుల కోటా విడుదల తేదీల వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) వెల్లడించింది. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను జూన్ 18న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది.
ఇ-సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం జూన్ 20వ తేదీ ఉదయం 10 గంటలకు వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఇ-సేవా టికెట్లు పొందిన భక్తులు జూన్ 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు డబ్బు చెల్లిస్తే లక్కీడిప్ టికెట్ మంజూరు అవుతుంది.
- జూన్ 21 ఉదయం 10 గంటలకు.. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు
- జూన్ 21 మధ్యాహ్నం 3 గంటలకు.. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటా టికెట్లు
- జూన్ 23 ఉదయం 10 గంటలకు.. అంగప్రదక్షిణ టోకెన్లు
- జూన్ 23 ఉదయం 11 గంటలకు.. శ్రీవాణి ట్రస్టు ఆన్లైన్ కోటా టికెట్లు
- జూన్ 23 మధ్యాహ్నం 3 గంటలకు.. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి ఉచిత ప్రత్యేక దర్శన టికెట్లు
- జూన్ 24 ఉదయం 10 గంటలకు.. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు
- జూన్ 24 మధ్యాహ్నం 3 గంటలకు.. తిరుపతి, తిరుమలలో గదుల బుకింగ్
- జూన్ 25 మధ్యాహ్నం 3 గంటలకు ఆగస్టు నెలకు సంబంధించి శ్రీవారి సేవ, పరకామణి సేవ, నవీనత సేవ, గ్రూప్ సూపర్వైజర్ల సేవల కోటా
శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవాలకు సంబంధించి టికెట్లను కేవలం https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని తితిదే సూచించింది.































