డయాబెటిస్‌ రోగులు పచ్చి ఉల్లి తింటే ఏమవుతుందో తెలుసా? చాలా మంది చేసే పొరబాటు ఇదే

నేటి కాలంలో ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న ఆరోగ్య సమస్యలలో డయాబెటిస్ ఒకటి. ఇది దీర్ఘకాలిక వ్యాధి కాబట్టి, ఈ ఆరోగ్య సమస్య ఉన్నవారు తమ ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.


మనసుకు ఏది అనిపిస్తే అది తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు విపరీతంగా పెరుగుతాయి. కాబట్టి ఆహారం ఎంత మంచిదైనా, తినే ముందు అది శరీరానికి మంచిదా కాదా అని ఒకటికి పది సార్లు ఆలోచించాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రకృతిలో లభించే అన్ని పండ్లు, కూరగాయలు మంచివే. కానీ ఏవి మన ఆరోగ్యానికి మంచివో మనమే నిర్ణయించుకోవాలి. ముఖ్యంగా డయాబెటిస్‌తో బాధపడేవారు కొన్ని కూరగాయల వినియోగాన్ని పరిమితం చేయాలి లేదంటే పూర్తిగా నివారించాలని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే కొన్ని కూరగాయలు రక్తంలో చక్కెర స్థాయిలను విపరీతంగా పెంచుతాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

బంగాళాదుంపలు

మీకు తెలుసా? బంగాళాదుంపలు చాలా ఎక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటాయి. అంతేకాకుండా వాటిలో అధిక పిండి పదార్ధం ఉంటుంది. అందువల్ల బంగాళాదుంపలను పెద్ద పరిమాణంలో తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. బంగాళాదుంపలు సులభంగా జీర్ణమవుతాయి. ఫలితంగా అవి రక్తంలోకి గ్లూకోజ్‌ను త్వరగా విడుదల చేస్తాయి. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే ప్రమాదం పెరుగుతుంది. అందుకే డయాబెటిక్ రోగులు బంగాళాదుంపల వినియోగాన్ని పరిమితం చేయాలి. అసలు పూర్తిగా దూరంగా ఉండటం ఇంకా మంచిది.

స్వీట్‌కార్న్

చాలా మంది స్వీట్ కార్న్ తినడానికి ఇష్టపడతారు. దీనికి చాలా డిమాండ్ ఉంది. స్వీట్ కార్న్ గ్లైసెమిక్ ఇండెక్స్ అంత ఎక్కువగా లేకపోయినా, ఇందులో అధిక స్థాయిలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. అందువల్ల పెద్ద పరిమాణంలో దీనిని తీసుకుంటే, అది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. అందుకే డయాబెటిక్ రోగులు స్వీట్ కార్న్‌ను చాలా పరిమిత పరిమాణంలో తినమని నిపుణులు సలహా ఇస్తున్నారు.

కాసావా

ఇది భూగర్భంలో పెరిగే ఓ కూరగాయ. దీనిని పచ్చిగా తినరు కానీ ఉడికించిన తర్వాత తియ్యగా ఉంటుంది. ఈ కూరగాయలో మంచి మొత్తంలో కేలరీలు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, పొటాషియం, ఫైబర్ ఉంటాయి. అందువల్ల దీనిని తీసుకోవడం వల్ల డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. దీని గ్లైసెమిక్ సూచిక మితంగా ఉన్నప్పటికీ, దీనిని పెద్ద పరిమాణంలో తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. అందువల్ల డయాబెటిస్ ఉన్నవారు ఈ కూరగాయలను తినకూడదు.

చిలగడదుంపలు

చిలగడదుంపలు ఆరోగ్యానికి చాలా మంచివి. అందుకే చాలా మంది వీటిని తినడానికి ఇష్టపడతారు. కానీ చిలగడదుంపలు డయాబెటిక్ రోగులకు మంచిది కాదు. చిలగడదుంపలు అధిక గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటాయి. అంతేకాకుండా వాటిలో అధిక మొత్తంలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఫలితంగా వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి.

క్యారెట్

ఈ కూరగాయను అధికంగా తీసుకోవడం వల్ల చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ముఖ్యంగా క్యారెట్ రసం తీసుకోవడం పూర్తిగా మానేయాలి. కాబట్టి డయాబెటిక్ రోగులు క్యారెట్లకు దూరంగా ఉండటం మంచిది.

పచ్చి ఉల్లిపాయ

పచ్చి ఉల్లిపాయలు కూడా అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. అది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. అందువల్ల డయాబెటిక్ రోగులు వాటిని అధికంగా తినకూడదని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.