ఓటీటీ ఆడియెన్స్ ను థ్రిల్ చేసేందుకు మరో క్రైమ్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో మే 30న థియేటర్లలో విడుదలైన ఈ సూపర్ హిట్ గా నిలిచింది.
గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఆడియెన్స్ కు సీట్ ఎడ్జ్ ఎక్స్ పీరియన్స్ అందించింది. బాక్సాఫీస్ వద్ద ఈ కు భారీగానే వసూళ్లు వచ్చాయి. ఆడియెన్స్ రెస్పాన్స్ చూసి ఐఎండీబీ కూడా ఈ మూవీకి ఏకంగా 9.0 రేటింగ్ ఇవ్వడం విశేషం. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ మొత్తం ఒక రాత్రి లో జరిగే స్టోరీ. ఆరుగురు స్నేహితుల చుట్టూ ఈ తిరుగుతుంది. వీరు ఓ రాత్రి పార్టీ అంటూ పీకలదాకా తాగుతారు. ఆ తర్వాత వాళ్ల జీవితాలు అనూహ్యంగా మారిపోతాయి. ఓ ఊహించని ఘటన అందరినీ ఇబ్బందుల్లోకి నెడుతోంది. దీంతో వాళ్లు ఒకరిపై మరొకరు అనుమానం వ్యక్తం చేసుకుంటారు. మరి అసలు ఏం జరిగింది? ఆ ఆరుగురి జీవితాలు ఏమయ్యాయి? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ థ్రిల్లర్ మూవీ చూడాల్సిందే
ఈ పేరు మనిదర్గల్. అంటే మనుషులు అని అర్థం. రామ్ ఇంద్ర తెరకెక్కించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ లో కపిల్ వేలవన్, దక్ష లీడ్ రోల్స్ లో నటించారు. వీళ్లే కాకుండా గుణవంతన్ ధనపాల్, అర్జున్దేవ్ శరవణన్, సాంబ శివమ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. థియేటర్లలో ఆడియెన్స్ ను మెప్పించిన ఈ మూవీ గురువారం (జులై 17) అర్ధరాత్రి నుంచే ఓటీటీలోకి వచ్చేసింది.
ఆహా తమిళ్ తో పాటు సన్ నెక్ట్స్ లో కూడా ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతానికి కేవలం తమిళ్ లో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్ కు వచ్చే ఛాన్స్ ఉంది.
































