వర్షాకాలంలో ఈ పండ్లు తిన్నారో.. రోగాలకు రెడ్‌ కార్పెట్‌ పరిచినట్లే

అందుకే ఈ సీజన్‌లో మనం తీసుకునే ఆహారం గురించి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యానికి పండ్లు చాలా మేలు చేస్తాయి. కానీ వర్షాకాలంలో కొన్ని పండ్లను తినకూడదని నిపుణులు అంటున్నారు. ఈ పండ్లు తినడం ఆరోగ్యానికి మరింత హానికరమట. ముఖ్యంగా వర్షాకాలంలో నీరు అధికంగా ఉండే పండ్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, జలుబు, దగ్గు వంటి సమస్యలు వస్తాయి. అవేంటో చూద్దాం. పుచ్చకాయలు వేసవిలో ఎక్కువగా లభిస్తాయి. వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అందుకే వర్షాకాలంలో తేమతో కూడిన వాతావరణానికి ఇవి మంచివి కావు. ఇవి సులభంగా బ్యాక్టీరియాతో కలిసిపోయి కడుపు సంబంధిత సమస్యలను పెంచుతాయి. ఒకవేళ తింటే తాజాగా ఉన్నప్పుడు తక్కువ మొత్తంలో మాత్రమే తినండి. వాటిని కోసి ఫ్రిజ్‌లో పెట్టడం.. రోజంతా తినడం చేయకూడదు. ఇది ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతుంది. ఫలరాజైన మామిడి పండ్లు వేసవిలో విరివిగా దొరుకుతాయి. ఒక్కసారి ఇవి మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చాయంటే చాలామంది వేరేపండ్లవైపు కన్నెత్తికూడా చూరు.


👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.