దేవాదాయశాఖలో ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు.

ఆంధ్రప్రదేశ్​ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దేవాదాయ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-III పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు.


అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ సెప్టెంబర్ 02.

పోస్టుల సంఖ్య: 07 (ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-III దేవాదాయశాఖ)

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి: కనిష్ట వయోపరిమితి 18 ఏండ్లు. గరిష్ట వయోపరిమితి 42 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్లు ప్రారంభం: ఆగస్టు 13.

లాస్ట్ డేట్: సెప్టెంబర్ 02.

అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీబీడబ్ల్యూడీఎస్, ఎక్స్ సర్వీస్​మెన్ అభ్యర్థులకు రూ.80. ఇతరులకు రూ.330.

సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

పూర్తి వివరాలకు psc.ap.gov.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.