రాష్ట్రంలో 5250 ఆలయలకు దూప దీప నైవేద్యం అమలు చేయడం జరుగుతుంది అని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
ఈ రోజు నుంచి సెప్టెంబర్ 16వ తేదీ వరకు నిర్వహించే బ్రహ్మోత్సవాలు ప్రారంభం సందర్భంగా స్వామివారికి ప్రభుత్వం తరఫున మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేలు పూతల పుట్టు శాసనసభ్యులు మురళీమోహన్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎండోమెంట్ కమిషనర్ రామచంద్ర మోహన్ తదితరులు పాల్గొన్నారు.
హిందూ ధర్మాన్ని ఆచరించే ప్రతీ కుటుంబానికి విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ఉండాలి
‘సీఎం చంద్రబాబు నాయుడు చొరవతో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి పూజా కైంకర్యాలు ప్రత్యక్షంగా ప్రతి ఆలయంలో పరివేక్షించడానికి, బ్రహ్మోత్సవాల సమయంలో ఆలయంలో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు లేకపోతే సహచర మంత్రివర్గాన్ని ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడం కోసం పంపడంఆనవాయితి. అనవాయితీలో భాగంగా నేడు కాణిపాకం వరసిద్ధి వినాయకుడికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది.’అని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పుకొచ్చారు. ‘గడిచిన సంవత్సరం వర్షాల ప్రభావంతో మేము రాలేకపోవడంతో స్థానిక శాసనసభ్యున్ని పట్టు వస్త్రాలు సమర్పించమని ప్రభుత్వం నుండి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. స్వామి వారి ఆశీస్సులు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి, హిందూ ధర్మాన్ని ఆచరించే ప్రతి కుటుంబానికి విఘ్నేశ్వరుని ఆశీస్సులు ఉండాలని కోరుకోవడం జరిగింది. ఎటువంటి విజ్ఞాలు కలగకుండా సమ సమాజ స్థాపన జరగాలని కోరుకోవడం జరిగింది.’అని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పుకొచ్చారు.
కాణిపాకం అభివృద్ధికి రూ.4 కోట్లు కేటాయింపులు
‘కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆశీస్సులతో నేడు కాణిపాకంలో అన్నప్రసాద వితరణ భవనాన్ని ప్రారంభించడం జరిగింది. దాదాపు రూ.4 కోట్లు వెచ్చించి అభివృద్ధి పనులు చేయడం జరిగింది’అని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో అనేక ఆలయాలకు కేంద్ర ప్రభుత్వం,రాష్ట్ర ప్రభుత్వం,దేవాదాయ శాఖ కలిపి ఎన్నో ఆలయాలు పున నిర్మాణం కోసం శ్రీకారం చుట్టడం జరిగింది. చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలు పునర్నిర్మాణ కార్యక్రమం జరిపి ఆలయంలో రోజు జరిగేటువంటి పూజా కార్యక్రమాలు ఆగమపండితుల ఆదేశాల మేరకు మాత్రమే జరిగేలా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు.
అర్చకుల పారితోషకం రూ.15వేలకు పెంపు
‘అర్చకులకు గతంలో పదివేల రూపాయల పారితోషకం ఉంటే ఈ ప్రభుత్వం వచ్చాక రూ.15వేలకు పెంచడం జరిగింది. ధూప దీప నైవేద్యాలకి గతంలో రూ.5000 రూపాయలు ఉంటే ఈ ప్రభుత్వంలో రూ.10,000 పెంచడం జరిగింది.’అని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ‘రాష్ట్రంలో 5250 ఆలయలకు దూప దీప నైవేద్యం అమలు చేయడం జరుగుతుంది. నాయి బ్రాహ్మణుల ఆదాయాన్ని పెంచడం కోసం 25వేల రూపాయలు ప్రతినెల వారికి పారితోషకం ఇవ్వడం జరుగుతుంది వేద విద్య అభ్యసించిన వేద విద్యార్థుల కు సంభవన కింద నెలకు 3000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది.’అని రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు.
త్వరలో 500 ఉద్యోగాల భర్తీ
‘మరోవైపు దేవాదాయ శాఖలో 500 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అందులో అర్చకుల మొదలు అన్నీ విభాగాల నుండి ఖాళీలు ఉన్నాయి. త్వరలోనే దేవాదాయ శాఖ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదలచేయబోతున్నాం.’అని రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ అభివృద్ధి రెండు కళ్ళల్లో పాలిస్తున్న చంద్రబాబు నాయుడుకి రాష్ట్ర ప్రజానీకానికి ఆశీస్సులు అందించాలని కాణిపాక వరసిద్ధి వినాయకుని కోరుకోవడం జరిగింది అని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఈ ఈ కార్యక్రమంలో టెంపుల్ ఈవో పెంచల కిషోర్, నగర మేయర్ ఆముద, ఎస్పీ మణికంఠ చందోలు, తదితరులు పాల్గొన్నారు.
































