రుషికొండ భవనాల వినియోగంపై ఏపీ ప్రభుత్వం దృష్టి

రుషికొండలో గత ప్రభుత్వం నిర్మించిన భవనాలను ఏ విధంగా వినియోగించాలనే అంశంపై ఆంధ్రప్రదేశ్‌ కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. భవనాల వినియోగంపై సమగ్ర అధ్యయనం చేసేందుకు ముగ్గురు మంత్రులతో కూడిన కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేశారు.


పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న భవనాలను సముచితంగా వినియోగించే మార్గాలను అన్వేషించి, తగిన సిఫార్సులు ప్రభుత్వానికి అందజేయాలని కమిటీకి సూచించారు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.