ఏపీలో రేషన్‌కార్డులు ఉన్నవారికి శుభవార్త.. ఇకపై చాలా ఈజీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా రేషన్‌ కార్డులు పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. అయితే రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ పంపిణీకి సిద్ధమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా రేషన్ డీలర్లకు కొత్త స్మార్ట్ ఈ-పోస్ యంత్రాలను పంపిణీ చేస్తున్నారు.


పాత కీప్యాడ్ ఈ-పోస్ యంత్రాల స్థానంలో ఈ కొత్త టచ్‌స్క్రీన్ యంత్రాలు వచ్చాయి. ప్రభుత్వం త్వరలో స్మార్ట్ రేషన్ కార్డులను జారీ చేయనుంది. ఈ కార్డులను ఈ యంత్రాల్లో స్వైప్ చేయవచ్చు.. పాత యంత్రాల వల్ల ఎదురైన సమస్యలను అధిగమించడానికి ఈ కొత్త యంత్రాలను తీసుకొచ్చారు.

కొత్త ఈ-పోస్ యంత్రాలు పాత వాటితో పోలిస్తే సరికొత్త టెక్నాలజీ, ఫీచర్లతో వచ్చాయి. ఈ మెషిన్లు చాలా వేగంగా పనిచేస్తాయి.. పాత యంత్రాల్లో నెట్‌వర్క్ సమస్యలు ఉండేవి.. ఈ కారణంగా రేషన్ డీలర్లు పంపిణీ విషయంలో ఇబ్బంది పడేవారు. ఇప్పుడు తీసుకొచ్చిన కొత్త ఈపోస్ మెషిన్లకు ఆ సమస్య ఉండదు. ఈ మెషిన్‌లో సిమ్ ఉంటుంది. నెట్ లేకపోతే, వైఫైకి కనెక్ట్ చేసుకోవచ్చు. బ్లూటూత్ ద్వారా కూడా కనెక్ట్ చేసుకోవచ్చు.. డీలర్ తన మొబైల్ హాట్‌స్పాట్‌ను ఉపయోగించి కూడా ఈ మెషిన్ ఉపయోగించొచ్చు. ఈ ఈపోస్ స్మార్ట్ టచ్ స్క్రీన్ ఉంది. ఇది ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది.

టచ్ చేస్తే వెంటనే లావాదేవీలు పూర్తవుతాయి.. స్మార్ట్ రేషన్ కార్డులను స్వైప్ చేయడానికి వీలుగా ఉంటుంది. స్మార్ట్ రేషన్ కార్డును ఈ మిషన్ పై పెట్టినా వైఫై ద్వారా ఆటోమేటిక్‌గా కనెక్ట్ అవుతుంది. ఈ పోస్ మెషిన్‌లో బయోమెట్రిక్ కోసం కూడా ఆప్షన్ ఉంది. వేలిముద్ర పడకపోతే, కెమెరా ద్వారా ఐరిస్ తీసుకుంటారు.. ఈ యంత్రంలో జీపీఆర్‌ఎస్ వ్యవస్థ ఉంది. ఇది డేటాను రికార్డ్ చేస్తుంది.. ఈ స్మార్ట్ మెషీన్లను ఉపయోగించడం ద్వారా డిపోల వద్ద రద్దీ ఉండదు.. క్యూ లైన్లు ఉండవంటున్నారు.. రేషన్ పంపిణీ వేగంగా పూర్తి చేయొచ్చు అంటున్నారు. అలాగే రేషన్ అక్రమాలకు అవకాశం ఉండదంటున్నారు. ఈ నెలలోకిన కొన్ని రేషన్ షాపుల్లో కొత్త మెషిన్లతో పంపిణీ ప్రారంభమైంది.. కొన్నిచోట్ల ఈ నెల 15 తర్వాత అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు.

ఈ మెషిన్లు స్మార్ట్ రేషన్ కార్డులోని క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తాయి. స్మార్ట్ రేషన్ కార్డుల్లోని క్యూఆర్ కోడ్‌ను ఈ మిషన్లు స్కాన్ చేస్తాయి. దీని ద్వారా కార్డుదారుల వివరాలు ఈ-పోస్‌లో నమోదవుతాయి. ఏ సరుకులు, ఎన్ని కిలోలు ఇవ్వాలనే వివరాలు కూడా నమోదవుతాయి. ఈ మిషన్లలో సిమ్, వైఫై, హాట్‌స్పాట్, బ్లూటూత్, టచ్ స్క్రీన్ వంటి సదుపాయాలు ఉన్నాయి. ఇవి ఆండ్రాయిడ్ టెక్నాలజీతో పనిచేస్తాయి. దీని ద్వారా వ్యవస్థలో పర్యవేక్షణ కట్టుదిట్టంగా ఉంటుందంటున్నారు. అంతేకాదు వినియోగదారులు తీసుకునే సరుకుల బిల్లును కూడా ఈ మిషన్ ద్వారా పొందవచ్చు అంటున్నారు. మొత్తం మీద రేషన్‌ తీసుకునేవారు ఇబ్బంది పడకుండా కొత్త మెషిన్లు అందిజేస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.