కఫం ఎక్కువైందా? దగ్గువంటి గొంతు సమస్యలను దూరం చేసే ఇంటి చిట్కాలు ఇవే

అల్లంలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. వేడి వేడి అల్లం టీ తాగడం వల్ల శ్లేష్మం కరిగిపోతుంది. గొంతు నొప్పి కూడా తగ్గుతుంది.


పసుపులో ఉండే కర్కుమిన్ శ్లేష్మాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచి సీజనల్ వ్యాధులను దూరం చేస్తుంది. కాబట్టి రాత్రి పడుకునే ముందు పసుపు పాలు తాగడం మంచిది.

తేనె గొంతు నొప్పిని తగ్గిస్తుంది. మిరియాలు శ్లేష్మాన్ని తగ్గిస్తాయి. రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల శ్వాస సమస్యలు దూరమై.. ముక్కు దిబ్బడ తగ్గుతుంది.

వేడి నీటితో ఆవిరి పీల్చడం వల్ల శ్లేష్మం త్వరగా కరిగి ఛాతీలో పేరుకున్నది తగ్గిపోతుంది. వేడి నీటిలో పుదీనా నూనె కొన్ని చుక్కలు వేసి ఆవిరి పీల్చుకోవడం వల్ల మరింత ఎఫెక్టివ్​గా ఉంటుంది.

తులసి ఒక సహజ యాంటీబయాటిక్​గా పనిచేస్తుంది. తులసి ఆకులను నమలడం లేదా తులసి టీ తాగడం వల్ల శ్లేష్మం నెమ్మదిగా బయటకు వస్తుంది. కఫాన్ని దూరం చేయడంలో హెల్ప్ చేస్తుంది.

గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి దానితో పుక్కిలించడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది. గొంతు నుంచి శ్లేష్మాన్ని దూరం చేయడంలో హెల్ప్ చేస్తుంది.

వెల్లుల్లిలోని యాంటీమైక్రోబియల్ లక్షణాలు కఫాన్ని దూరం చేయడంలో హెల్ప్ చేస్తాయి. దీన్ని పాలలో ఉడకబెట్టి తాగడం లేదా ఆహారంలో చేర్చుకోవడం వల్ల శ్లేష్మం తగ్గుతుంది. రోగనిరోధక శక్తి కూడా బలపడుతుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.