ప్రస్తుతం ఓటీటీ ప్రపంచంలో పలు చిత్రాలు రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. ఆసక్తికరమైన కథాంశం… విభిన్నమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
హారర్, సస్పెన్స్, మిస్టరీ చిత్రాలు ఇప్పుడు సత్తా చాటుతున్నాయి. ఇటీవల విడుదలైన ఒక జనాలకు నచ్చేసింది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సూక్ష్మదర్శిని . మలయాళ భాషలో రూపొందిన బ్లాక్ కామెడీ మిస్టరీ థ్రిల్లర్ నవంబర్ 22, 2024న థియేటర్లలోకి అడుగుపెట్టింది. MC జితిన్ దర్శకత్వం వహించగా లిబిన్ TB, అతుల్ రామచంద్రన్ రచించారు. ఈ చిత్రంలో బాసిల్ జోసెఫ్, నజ్రియా నజీమ్ ఫహద్ కీలకపాత్రలు పోషించారు. తక్కువ సమయంలోనే మంచి రెస్పాన్స్ అందుకుంది.
జనవరి 11, 2025 నాటికి, సూక్ష్మదర్శిని ఇప్పటికీ హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషలలో ఈ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. కథ విషయానికి వస్తే.. సూక్ష్మదర్శిని కథాంశం ప్రియదర్శిని (అకా ప్రియ) అనే సాధారణ గృహిణి తన భర్త ఆంటోనీ కుమార్తె కనితో ప్రశాంత జీవితాన్ని గడుపుతుంది. మాన్యుయేల్ అనే వ్యక్తి తన తల్లి గ్రేస్ తో కలిసి వారి కలనీలోకి ప్రవేశించి గ్రేస్ బేకర్స్ ను ప్రారంభించడంతో వారి జీవితాల్లో మలుపులు చోటు చేసుకుంటాయి. మాన్యుయేల్ వింత ప్రవర్తన, గోప్యత ప్రియా అనుమానాలను రేకెత్తిస్తుంది. ఆ తర్వాత అతడి గురించిఎన్నో రహస్యాలు తెలుసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది .
రూ. 14 కోట్ల బడ్జెట్తో నిర్మించిన సూక్ష్మదర్శిని రూ. 27.92 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ. 22.25 కోట్లు వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ. 54.36 కోట్లు వసూలు చేసింది. ఇది దాని బడ్జెట్ కంటే 4 రెట్లు ఎక్కువ సంపాదించింది. ప్రస్తుతం IMDbలో 7.8 రేటింగ్తో ఉంది.


































