ఏపీలో నిరుద్యోగులకు .36వేల నుంచి రూ.64వేల జీతంతో ఉద్యోగాలు.. కోర్సు ఫ్రీగా, ఫుడ్, హాస్టల్ ఉచితం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి సీడాప్ (సొసైటీ ఫర్ ఎంప్లాయ్‌మెంట్ డెవలప్‌మెంట్ ఇన్ ఏపీ)..


డీడీయూ- జీకేవై (దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన) ద్వారా నిరుద్యోగులకు ఉచితంగా శిక్షణ అందిస్తున్నారు. ఇంటర్, డిగ్రీ, బీటెక్ చదివిన వారికి ఉద్యోగ అవకాశాలు రావాలంటే నైపుణ్యం ఉండాల్సిందే.. ఏదైనా కోర్సుల్లో చేరాలంటే వేలకు, వేలు డబ్బులు ఖర్చు చేయాలి. అందుకే గ్రామీణ ప్రాంతాల నిరుద్యోగులు, విద్యార్థుల కోసం.. ఉద్యోగాల సాధించేందుకు అవసరమైన శిక్షణ అందిస్తున్నారు.

వేర్‌హౌస్‌ సూపర్‌వైజర్‌, కస్టమర్‌ కేర్‌ ఎగ్జిక్యూటివ్‌ (నాన్‌ వాయిస్‌), ప్రొడక్షన్‌ ఇంజినీర్‌, రెస్టారెంట్‌ కెప్టెన్‌, మల్టీ స్కిల్‌ టెక్నీషియన్‌, ఫీల్డ్‌ టెక్నీషియన్‌ కంప్యూటింగ్‌ అండ్‌ పెరిఫెరల్స్‌, ఇండస్ట్రియల్‌ ఎలక్ట్రీషియన్‌, ఇండస్ట్రియల్‌ ఆటోమేషన్‌ స్పెషలిస్ట్‌ వంటి వాటిలో ప్రస్తుతానికి శిక్షణ అందిస్తున్నారు. శిక్షణా సమయంలో కంప్యూటర్, డొమైన్‌తో పాటుగా స్పోకెన్ ఇంగ్లీష్, ఇంటర్వ్యూ సాఫ్ట్‌ స్కిల్స్‌ వంటి కూడా నేర్పిస్తారు. 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండి పదో తరగతి, డిప్లమో, ఐటీఐ, బీటెక్ చదివినవారికి అవకాశం ఉంటుంది.

ఈ కోర్సుల్లో చేరిన వారికి అనుభవం ఉన్న ట్రైనర్ల ద్వారా నైపుణ్యాలు నేర్పిస్తారు. వీరికి 90 రోజులు పాటూ క్లాసులు నిర్వహిస్తారు.. 30 రోజుల పాటూ క్షేత్రస్థాయిలో మెళుకువలు కూడా నేర్పుతారు. ఆయా పరిశ్రమలకు తీసుకెళ్లి అక్కడ పనితీరును పరిశీలించే అవకాశం కల్పిస్తారు. శిక్షణ కోసం వచ్చే యువతీ, యువకులకు ఉచిత భోజనం, హాస్టల్ వసతి కూడా ఉంది. అంతేకాదు వారికి యూనిఫామ్ రెండు జతలు, షూ, మరికొన్ని అవసరమైన వస్తువులు ఇస్తారు. శిక్షణ అనంతరం జాతీయస్థాయి స్కిల్‌ ఇండియా సర్టిఫికెట్‌ అందిస్తారు.. పలు మల్టీ నేషనల్ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారు.

ఇలా శిక్షణ పూర్తి చేసుకున్న యువతకు విశాఖపట్నం, తిరుపతిలోని శ్రీసిటీ, పుణె, మరికొన్ని నగరాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. ఒక్కొక్కరికి వారు ట్రైనింగ్ తీసుకున్న కోర్సును బట్టి రూ.36,000 నుంచి రూ.64,000 వరకు జీతం వచ్చేలా ఉద్యోగాలు వస్తాయి అంటున్నారు. ఆసక్తిగలవారు 6303000080, 9491070295, 9492572737, 9912459533 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. అంతేకాదు ఇండియన్‌ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB)తో ఒప్పందం చేసుకున్నట్లు సీడాప్ ఛైర్మన్‌ దీపక్‌రెడ్డి తెలిపారు. యువతకు అవసరమైన శిక్షణ అందించి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. సుమారు 24 సెక్టార్లలో శిక్షణ ఇచ్చేందుకు ఐఎస్‌బీతో ఒప్పందం చేసుకున్నామన్నారు. అంతేకాదు గతంలో సెంచూరియన్ యూనివర్శిటీతోనూ ఒప్పందం చేసుకున్నామన్నారు. రాబోయే రోజుల్లో వీలైనంతమందికి శిక్షణ ఇచ్చే దిశగా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.