తిరుమలలో భక్తులు ఇలా చేస్తే ఉచితంగా డబ్బులు.. చాలా సింపుల్, ఆ మెషిన్‌లో స్కాన్ చేసి

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ముఖ్యగమనిక. తిరుమల పీఏసీ-5లో వినూత్నమైన ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్ యంత్రం Reklaim Ace ఏర్పాటు చేశారు.


ఆ యంత్రం పనితీరును అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి పరిశీలించారు. ఆ సంస్థ అధిపతి శ్రీ వివేక్ యంత్రం ఉపయోగాలను వివరించడంతో పాటు ప్రజలకు దీని అవసరంపై అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని వివరించారు. ‘ఇప్పటికే ఈ యంత్రాన్ని ఉత్తరాఖండ్‌లోని చారధామ్‌ ప్రాంతంలో ఏర్పాటు చేసి భక్తులు ఉపయోగించిన ప్లాస్టిక్ బాటిళ్లను పవిత్ర గంగా జలాల్లో వేయకుండా, వాటిని సేకరించే విధానాన్ని అమలు చేస్తు్న్నాము’ అని తెలిపారు.

ప్రజలు ఈ యంత్రంలో టెట్రా ప్యాక్స్, స్నాక్స్ ప్యాకెట్లు వదిలివేయవచ్చు.. అందుకోసం యూపీఐ ద్వారా లాగిన్ అయ్యి క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి, డ వారికి రూ.5 ప్రోత్సాహకంగా లభిస్తుందని తెలిపారు. దీని ద్వారా సామాజిక అవగాహన పెంచడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు తోడ్పడటమే లక్ష్యమని ఆయన తెలియజేశారు. ఈ వినూత్న యంత్రం పనితీరును అదనపు ఈవో ప్రశంసించారు. ఈ సందర్బంగా ఈఈ-5 వేణు గోపాల్‌, ఎలక్ట్రికల్‌ డిఈ చంద్రశేఖర్‌, తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి భక్తులు ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను ఈ యంత్రంలో రీస్లైకింగ్ చేయొచ్చని తెలిపారు.

శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు

‘దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో సెప్టెంబరు 22 నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు నవరాత్రి ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా సదరు రోజులలో ప్రతిరోజూ ఉదయం 11 గం.ల నుండి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు, ఇతర పండ్ల రసాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. ప్రతి రోజూ సాయంత్రం 07 గం.లకు వాహన సేవలు ప్రారంభం కాగా,28వ తేదీ గరుడ వాహనంపై 05.00 గం.లకు స్వామి, అమ్మవారు భక్తులను ఆశీర్వదించనున్నారు’ అని తెలిపారు.

‘ఈ సందర్భంగా సెప్టెంబర్ 22వ తేదీ సాయంత్రం తిరుచ్చి ఉత్సవం, 23వ తేదీ శేష వాహనం, 24వ తేదీ చిన్న ప్రభ వాహనం, 25వ తేదీ హనుమంత వాహనం, 26వ తేదీ గరుడ వాహనం, 27వ తేదీ ముత్యపు పందిరి వాహనం, 28వ తేదీ గరుడ వాహనం, 29వ తేదీ తిరుచ్చి వాహనం, 30వ తేదీ సర్వభూపాల వాహనం, అక్టోబర్ 01వ తేదీ చిన్న శేష వాహనం, అక్టోబర్ 02వ తేదీ అశ్వవాహనంపై స్వామి, అమ్మవారు విహరించి భక్తులను ఆశీర్వదించనున్నారు’ ఒక ప్రకటనలో టీటీడీ తెలిపింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.